Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ నిర్వహణపై స్పష్టత
ముంబయి : 2020-2021 రంజీ ట్రోఫీ నిర్వహణపై నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది రంజీ ట్రోఫీని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆరు బయో సెక్యూర్ బబుల్ కేంద్రాల్లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహిస్తున్న బోర్డు... అదే కేంద్రాలు వేదికగా రంజీ ట్రోఫీని సైతం నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. 38 జట్లతో కూడిన కుదించిన రంజీ ట్రోఫీపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నేడు వర్చువల్గా సమావేశం కానుంది. రంజీ ట్రోఫీ సహా మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ నిర్వహణపై సైతం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ ఈవెంట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు కోరటం సైతం అజెండాలో ముఖ్య అంశంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వినోదపు పన్ను మినహాయింపు రాకుంటే, ఐసీసీ ఆదాయంలో బోర్డు వాటా నుంచి తీసుకునేందుకు అపెక్స్ కౌన్సిల్లో ప్రతిపాదన తేనున్నట్టు సమాచారం.