Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటగాళ్ల వేలంపై బీసీసీఐ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా సమర్పించేందుకు జనవరి 20 డెడ్లైన్ విధించిన బీసీసీఐ... ఆటగాళ్ల వేలంపై తేదీ ఖరారు చేయలేదు. ఫిబ్రవరి 11న చెన్నైలో లేదా అహ్మదాబాద్లో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. బీసీసీఐ అధికారి ఒకరు ఆటగాళ్ల వేలం తేదిపై అనధికారికంగా వెల్లడించాడు. 'ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరుగనుంది. వేదికపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 2020 ఐపీఎల్ యుఏఈ వేదికగా నిర్వహించగా.. 2021 ఐపీఎల్ను భారత్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్లను ఐపీఎల్ ప్రాంఛైజీలు వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే.