Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో పి.వి సింధు ఓటమి -థారులాండ్ ఓపెన్ 2021
బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్లో ఆరో సీడ్ పీవి సింధు పరాజయం చవిచూసింది. నాల్గో సీడ్ రచనోక్ ఇంటనాన్ (థారులాండ్) చేతిలో సింధు ఓటమి పాలైంది. క్వార్టర్ఫైనల్లో సింధు వరుస గేముల్లో ఓడిపోయింది. 38 నిమిషాల మ్యాచ్ను సింధు 13-21, 9-21తో కోల్పోయింది. నాల్గో సీడ్ థారులాండ్ షట్లర్ రచనోక్ వరుస సెట్లలో సింధుపై సులువైన విజయం ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో సమీర్ వర్మ ఓడిపోయాడు. మూడో సీడ్ షట్లర్తో మూడు గేముల పోరాటంతో తలొంచాడు.
13-21, 21-19, 20-22తో సమీర్ వర్మ పోరాడి ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, అశ్విని పొన్నప్ప జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఐదో సీడ్ మలేషియా జోడీ చన్ పెంగ్ సూన్, లూ యింగ్పై 18-21, 24-22, 22-20తో సాత్విక్, అశ్విన్ జంట గెలుపొందింది. తొలి గేమ్ను కోల్పోయినా.. చివరి రెండు గేముల్లో భారత జోడీ గొప్పగా పుంజుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో థారులాండ్ జంట, టాప్ సీడ్ డెచాపల్, సపీశ్రీ జోడీతో తలపడనుంది.