Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికెట్ కీపింగ్ నైపుణ్యంపై సాహా
కోల్కత : భారత క్రికెట్ జట్టులో అత్యధికంగా చర్చల్లో నిలుస్తున్న క్రికెటర్ రిషబ్ పంత్. దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనితో పోలికలు, అంచనాలు అందుకోలేకపోవటంతో విమర్శలు రావటం పంత్కు పరిపాటిగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రెండు టెస్టుల్లో అద్వితీయ ప్రదర్శన చేసిన రిషబ్ పంత్ క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకుంటున్నాడు. సిడ్నీలో 97 పరుగులు చేసిన రిషబ్ పంత్, బ్రిస్బేన్ ఛేదనలో అజేయంగా 89 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా పరిమితులు ఉన్నప్పటికీ, బ్యాట్స్మన్గా రిషబ్ పంత్ అసమాన ప్రదర్శన చేశాడు. ' రిషబ్ పంత్తో నాది స్నేహపూర్వక బంధం. తుది జట్టులో ఎవరు నిలిచినా, ఒకరికొకరం సహకారం చేసుకుంటాం. వ్యక్తిగతంగా నాకు పంత్తో ఎటువంటి వైరం లేదు. నం.1, నం.2 వికెట్ కీపర్ ఎవరనే చర్చ అనవసరం. తుది జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు. నా పని చేయటం నా బాధ్యత. ఎంపిక జట్టు మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. ఏ ఒక్కరూ ఒకటో తరగతిలోనే బీజగణితం నేర్చుకోరు. ఎప్పుడైనా ఒక్కో మెట్టే ఎక్కాలి. రిషబ్ పంత్ తన ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు, కచ్చితంగా మరింత మెరుగవుతాడు. రిషబ్ పంత్ ఎంతో పరిణితి సాధించాడు, దీర్ఘకాలంలో ఇంకెంతో మెరుగవుతాడు. భవిష్యత్లో అతడు భారత జట్టుకు విలువైన ఆస్తి కాగలడు. చివరి మూడు టెస్టులకు తుది జట్టులో నేను లేకపోయినా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను' అని వృద్దిమాన్ సాహా అన్నాడు.