Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నై :భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు రవిచంద్రన్ అశ్విన్ సవాల్ విసిరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో సమారు వెయ్యి బంతులు ఎదుర్కొన్న పుజారా.. పరుగుల పరంగా తక్కువే చేసినా సిరీస్పై అతడి ప్రభావం అమోఘం. ఓ ఎండ్లో అతడు ఉన్నాడనే అండతోనే సిడ్నీలో, బ్రిస్బేన్లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్మన్గిల్లు చెలరేగారు. స్పిన్నర్లపై దూకుడుగా ఆడేందుకు పుజారా ఇష్టపడడు. ' ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో మోయిన్ అలీ లేదా ఇతర ఏ స్పిన్నర్నైనా క్రీజు వదిలి పుజారా ఎదురుదాడి చేస్తే నేను సగం మీసం తీసేసి మైదానంలోకి వస్తాను' అని అశ్విన్ సవాల్ విసిరాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్తో తన యూట్యూబ్ చానల్లో అశ్విన్ ఈ ఫ్రెండ్లీ సవాల్ విసిరాడు. మరి, పుజారా సవాల్ను స్వీకరిస్తాడేమో చూడాలి.