Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారికంగా ప్రారంభించనున్న కోవింద్
అహ్మదాబాద్ : ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ప్రారంభించను న్నారు. భారత్, ఇంగ్లాండ్ నడుమ జరుగనున్న డే నైట్ పింక్ బాల్ టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. బుధవారం ఉదయం అహ్మదాబాద్కు చేరుకోనున్న రాష్ట్రపతి కోవింద్.. మధ్యాహ్నాం 12.30లకు సర్దార్ వల్లభబారు పటేల్ స్టేడియంను అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర హౌం మంత్రి, గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) మాజీ అధ్యక్షుడు అమిత్ షా సహా ఇతర గుజరాత్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 63 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోతెరా స్టేడియంలో ఎర్ర, నల్ల మట్టితో చేసిన 11 పిచ్లు ఉన్నాయి. 1,32,000 సీటింగ్ సామర్థ్యం కలిగిన మోతెరాలో కోవిడ్-19 నిబంధనల కారణంగా రోజుకు 50,000 మందినే అనుమతించనున్నారు.