Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఆరంభోత్సవంలోనే మహానేత వారసత్వాన్ని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ), కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. సర్దార్ వల్లభబారు పటేల్ మోతెరా స్టేడియాన్ని 2016లో పునర్మించారు. ఎల్టీ నిర్మాణ కంపెనీ భారీ వ్యయంతో ఈ స్టేడియంను నిర్మించింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ (90,000) సామర్థ్యాన్ని మించి ఉండాలనే లక్ష్యంతో స్టేడియం పునర్నిర్మాణం మొదలైంది. 1,10,000 మంది కూర్చుని మ్యాచ్ను వీక్షించే సామర్థ్యంతో పాత స్టేడియం ప్రదేశంలోనే దీన్ని నిర్మించారు. ఆధునాతన స్టేడియంలో నాలుగు డ్రెస్సింగ్రూమ్లు, 50 డీలక్స్ రూమ్లు, ఐదు షుట్ రూమ్లతో కూడిన క్లబ్ హౌస్, ఆరు ఇండోర్ పిచ్లు, పెవిలియన్లతో కూడిన రెండు అవుట్డోర్ మైదానాలు, స్టేడియం పైకప్పుతో పాటు ఎల్ఈడీ వెలుగులు మోతెరా స్టేడియాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన మోతెరా స్టేడియానికి సర్దార్ వల్లభబారు పటేల్ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆధునాతన స్టేడియానికి ప్రధాని నరెంద్ర మోడీ పేరును పెడుతున్నట్టు కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ పింక్ పోరుకు ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మోతెరాను అధికారికంగా ఆరంభించారు. కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు, గుజరాత్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, గుజరాత్ క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్లు, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు.