Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: మేము టాస్ నెగ్గినా, సద్వినియోగం చేసుకోలేదు. తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులైనా చేయాల్సింది అని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అన్నారు. బంతితో కొంత సమస్య ఎదుర్కొన్నామని చెప్పగలను. మ్యాచ్లో ఇరు జట్లూ తడబడ్డాయి. ఇటువంటి ప్రదర్శనను ఏ విధంగా సర్దిచెప్పుకోలేము. చివరి టెస్టుకు ముందు ఈ ఓటమి భారాన్ని వదిలేయటం కీలకం. భారీ స్కోర్లు సాధించగల సమర్థులైన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. స్పిన్ లభించటంతో నాకు ఐదు వికెట్లు దక్కాయి. అశ్విన్ 400 వికెట్ల మైలురాయి చేరుకోవటం అమోఘం.