Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్:ఇరు జట్ల బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారని అనుకోవటం లేదు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నారు. స్పిన్ పిచ్ పై అనుగుణంగా ఆడటంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఇరు జట్ల బ్యాటింగ్ ప్రదర్శన చెత్తగానే ఉంది. 30 వికెట్లలో ఏకంగా 21 వికెట్లు నేరుగా వచ్చిన బంతులకే లభించటం వింతగా ఉంది. బ్యాట్స్మెన్ ఏకాగ్రత లోపాన్ని ఇది ఎత్తిచూపుతుంది. టెస్టు మ్యాచ్లో పని భారం తగ్గిస్తున్నారని బుమ్రా అనగా, వందో టెస్టులో బౌలింగే ఇవ్వటం లేదని ఇషాంత్ వాపోయాడు. వాషింగ్టన్ సుందర్ ఎట్టకేలకు 3 బంతులతో సంతోషించాడు. అక్షర్ పటేల్ అద్బుతంగా రాణించాడు. అశ్విన్ ఆధునిక క్రికెట్ లెజెండ్. తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ నుంచి కాస్త తీరిక దొరకటం మంచిదే. ఇంత వేగంగా మలుపులు తిరిగిన టెస్టును చూడటం ఇదే తొలిసారి.