Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజుజు
గుల్మార్గ్ : భవిష్యత్లో వింటర్ స్పోర్ట్స్కు గుల్మార్గ్ అంతర్జాతీయ గమ్యస్థానం కానుందని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. జాతీయ రెండవ ఖేలో ఇండియా క్రీడలను శుక్రవారం ప్రధానమంత్రి నరెంద్ర మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. ' ఈరోజు ఖేల ఇండియా వింటర్ గేమ్స్ 2021 ఆరంభం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ వేడుక చేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. జమ్మూ, కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్తో కలిసి క్రీడాశాఖ వింటర్ గేమ్స్ను గొప్పగా నిర్వహించనుంది. వింటర్ గేమ్స్కు క్రీడాకారులు బాగా సన్నద్ధమయ్యారు. హిమాలయ ప్రాంతంలో వింటర్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఓ ప్రపంచ శ్రేణి సౌకర్యం ఉండాలని అనుకున్నాం. భవిష్యత్లో గుల్మార్క్ వింటర్ గేమ్స్కు అంతర్జాతీయ వేదిక కానుంది. అందుకోసం మేము అన్ని విధాలా సిద్ధం చేస్తున్నాం' అని కిరణ్ రిజుజు ట్వీట్టర్లో పేర్కొన్నారు.