Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్
అహ్మదాబాద్ : శ్రీలంకపై 2-0 సిరీస్ విజయంతో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. చెన్నై తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నుంచి చారిత్రక విజయంతో స్వదేశానికి చేరుకున్న భారత్కు గర్వభంగం చేసింది. 22 ఏండ్లలో తొలిసారి చెపాక్లో ఆతిథ్య జట్టుకు ఓటమి చూపించింది. తొలి టెస్టులో టాస్ కోల్పోవటం మ్యాచ్ ప్రభావం చూపటంతో.. తర్వాతి రెండు టెస్టులకు భిన్నంగా సిద్ధమైంది. చెన్నైలో, అహ్మదాబాద్లో వరుస విజయాలు సాధించింది. సిరీస్లో 0-1 వెనుకంజ నుంచి 2-1తో సిరీస్ కోల్పోని స్థితికి చేరుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో ఇంగ్లాండ్కు చోటు లేకుండా చేసింది. పింక్ బాల్తో డే నైట్ టెస్టులో రెండు రోజుల్లోనే పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్.. సిరీస్లో ఆఖరు, నాలుగో టెస్టులో పుంజుకోవటం సైతం అనుమానమే. మరో స్పిన్ పిచ్ ఎదురుచూస్తున్న వేళ ఇంగ్లీష్ జట్టు సన్నద్ధతపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. పింక్ బాల్ ఓటమి బాధను ప్రేరణగా మలచుకుని నాలుగో టెస్టుకు బరిలోకి దిగుతామని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ' మేము ప్రయత్నిస్తాం, మెరుగవుతాం. ఈ బలహీనమైన వారం రోజులు మా జట్టును నిర్ణయించలేవు. సాధించగల సత్తా ఈ జట్టుకు ఉందని మాకు తెలుసు. మేము పుంజుకుంటాం, ఈ ఓటమి బాధను ప్రేరణగా మలుచుకుంటాం. ఆఖరు టెస్టులో మరింత బలంగా సిద్ధమవుతాం. ఆఖరు టెస్టుకు వెళ్లేముందు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అనుకుంటున్నాం. రాత్రి రాత్రికి మాది బలహీన జట్టు కాబోదు. తొలి ఇన్నింగ్స్లో మేము ఒక దశలో మెరుగైన స్థితిలోనే ఉన్నాం, కానీ ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం' అని జో రూట్ అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ గులాబీ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఓ టెస్టు సమరం ఇలా రెండు రోజుల్లోనే ముగియటం ఇది ఎనిమిదోసారి కావటం గమనార్హం. గతంలో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా (1946), ఇంగ్లాండ్-వెస్టిండీస్ (2000), ఆస్ట్రేలియా-పాకిస్థాన్ (2002), దక్షిణాఫ్రికా-జింబాబ్వే (2005), జింబాబ్వే-న్యూజిలాండ్ (2005), దక్షిణాఫ్రికా-జింబాబ్వే (2017), భారత్-అఫ్ఘనిస్థాన్ (2018) టెస్టులు సైతం రెండు రోజుల్లోనే ముగిశాయి.