Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే అథ్లెట్లకు అనుమతి
టోక్యో : జపాన్కు త్వరలోనే విశ్వ క్రీడా సంబురం కళ రానుంది. ఈ ఏడాది జులైలో టోక్యో 2020 ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జపాన్లో వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు ప్రస్తుతం అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీ అథ్లెట్లు, పర్యాటకుల రాకపై నియంత్రణలు ఎత్తివేయలేదు. అయితే త్వరలోనే విదేశీ అథ్లెట్ల రాకపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 7న ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేయనున్న జపాన్ ప్రభుత్వం.. విదేశీ అథ్లెట్లకు రాచబాట వేయనుంది. ఒలింపిక్స్ కోసం జపాన్కు వచ్చే అథ్లెట్లు 14 రోజుల స్వీయ ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదని జపాన్ ఇదివరకే స్పష్టం చేసింది. అథ్లెట్లు క్రీడా గ్రామానికి మాత్రమే పరిమితం అయినప్పుడు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఒలింపిక్స్లో పోటీపడే అథ్లెట్లు ముందుగానే జపాన్కు చేరుకొని ప్రాక్టీస్ చేసే ప్రణాళికల్లో ఉన్నారు. మార్చి ఆఖరు వారం నుంచి విదేశీ అథ్లెట్ల రాక మొదలైతే ఇక్కడ క్రీడా వేడుక టోక్యో ముస్తాబు కానుంది.