Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ను వేదికగా ఎంచుకోండి
- బీసీసీఐకి రాష్ట్ర మంత్రి కెటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్కు రంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఎనిమిది నగరాలు వేదికలుగా ఐపీఎల్ను నిర్వహించే అవకాశం లేదు. ఐదు నగరాల్లో బయో సెక్యూర్ బబుల్స్ ఏర్పాటు చేసి అక్కడే లీగ్ ఏకధాటిగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ను యుఏఈలో మూడు నగరాల్లో నిర్వహించగా.. ఈ సీజన్ను భారత్లోనే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్కత, న్యూఢిల్లీ నగరాల్లో లీగ్ దశ మ్యాచులు.. అహ్మదాబాద్ వేదికగా ప్లే ఆఫ్స్ నిర్వహణకు తాత్కాలిక ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆతిథ్య నగరాల జాబితా నుంచి హైదరాబాద్ను విస్మరించటాన్ని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐని కోరుతూ ట్వీట్ చేశాడు. 'బీసీసీఐ, ఐపీఎల్ ఆఫీస్ బేరర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి బహిరంగ విజ్ఞప్తి. రానున్న ఐపీఎల్ సీజన్ ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్ను చేర్చాలని కోరుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యలతో మెట్రో నగరాల్లో అతి తక్కువ కోవిడ్ కేసులు హైదరాబాద్లోనే నమోద య్యాయి. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహ కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆలస్యమైందా?! : కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021ను పరిమిత నగరాల్లోనే నిర్వహి స్తున్నారు. ముంబయి, న్యూఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల సహా ఇతర కారణాల రీత్యా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలు అనుమతుల కోసం ప్రయత్నించాల్సి ఉంది. ఐపీఎల్ ఆతిథ్య నగరాల జాబితాలో హైదరాబాద్ను తొలుత చేర్చారు. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో గ్రూపు రాజకీయాలు, అవినీతి అక్రమాలతో కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. స్థానిక ఆటగాళ్లను సన్రైజర్స్ వేలంలో తీసుకోనందుకు ఐపీఎల్ మ్యాచులను బహిష్కరిస్తామని తెరాస నాయకుడు, ఎమ్మెల్కే దానం నాగేందర్ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో బీసీసీఐ, ఐపీఎల్ బృందం ఆతిథ్య నగరాల జాబితా నుంచి హైదరాబాద్ను తప్పిం చింది. ప్రేక్షకుల అనుమతికి మహారాష్ట్ర సిద్ధంగా లేకపోయినా అక్కడ ఐపీఎల్ నిర్వహణకు అడు గులు వేస్తోంది. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఎన్ని వార్తలొచ్చినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచుల కేటాయింపు కోసం ట్వీట్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది. హెచ్సీఏ అక్రమాలపై విచారణ జరిపి, జట్ల ఎంపికలో పారదర్శకతకు కాస్త చొరవ చూపినా.. ఐపీఎల్ మ్యాచులతో పాటు ప్రతిభావంతులైన క్రికెటర్లకు న్యాయం జరిగేది. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా అనేది ఆసక్తికరం. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 11న ఆరంభమై.. జూన్ 6న టైటిల్ పోరుతో ముగిసే అవకాశం కనిపిస్తోంది.