Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో టెస్టుపై అజింక్య రహానె
అహ్మదాబాద్ : స్పిన్ పిచ్లపై వస్తున్న విమర్శలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. రెండు, మూడో టెస్టుల మాదిరిగానే నాలుగో టెస్టుకూ పిచ్ ఉంటుందని రహానె అభిప్రాయపడ్డాడు. ' నాలుగో టెస్టుకు ఎదురయ్యే పిచ్.. చెన్నై రెండో టెస్టు స్పిన్ ట్రాక్ తరహాలో ఉంటుంది. డే నైట్ టెస్టులో గులాబీ బంతి వ్యత్యాసం చూపించింది. ఎర్ర బంతితో పోల్చితే కాస్త వేగంగా కదిలింది, అందుకు తగినట్టు మార్పులు చేసుకోవాలి. చివరి రెండు టెస్టుల మాదిరిగానే చివరి టెస్టుకూ పిచ్ ఉంటుంది. చాలా మంది తమకు తోచింది మాట్లాడతారు. మేము విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఆతిథ్య జట్టు అనుకూల సీమింగ్ పిచ్లపై ఎవరూ మాట్లాడరు. ఎప్పుడూ భారత బ్యాట్స్మెన్ టెక్నిక్ గురించే మాట్లాడుతారు. జనాలు మాట్లాడే విషయాలను సీరియస్గా తీసుకోవాలని అనుకోవటం లేదు. విదేశీ పిచ్లు తొలి రోజు తడిగా ఉంటాయి. పచ్చికతో కూడిన పిచ్లు భిన్నంగా స్పందిస్తాయి. బ్యాటింగ్ చేసేందుకు ప్రమాదకరంగా ఉంటాయి. అయినా మేము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు' అని రహానె అన్నాడు.