Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ అభిమానుల ప్రవేశంపై జపాన్
టోక్యో : టోక్యో 2020 (2021) ఒలింపిక్స్కు విదేశీ పర్యాటకులు, అభిమానులను అనుమతించే విషయంపై జపాన్ ప్రభుత్వం మార్చి నెలాఖరులోగా తేల్చనుంది. ఈ మేరకు ఒలింపిక్స్ మంత్రి తమయో మరుకవ వెల్లడించింది. మార్చి 25 లోపు విదేశీ పర్యాటకులపై నిర్ణయం తీసుకుంటామని ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కమిటీ చీఫ్ షీకో హషిమోట సైతం మీడియాతో వ్యాఖ్యానించింది. కోవిడ్-19 ప్రమాదకర పరిస్థితుల్లో జపాన్లో ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహణకు ప్రజలు సుముఖంగా లేరు. ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు మెజారిటీ ప్రజలు ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణపై సానుకూలంగా లేరు. అమెరికా, ఐరోపా దేశాలతో పోల్చితే జపాన్లో కరోనా వైరస్ ప్రభావం తక్కువే. విదేశీ పర్యాటకులను ఒలింపిక్స్ను అనుమతిస్తే.. జపాన్లో కోవిడ్-19 వ్యాప్తి వేగంగా జరుగుతుందని అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 2020లోనే జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాది జులైకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ సన్నద్ధతకు జపాన్కు వస్తున్న విదేశీ అథ్లెట్లకు 14 రోజుల ఐసోలేషన్ నిబంధన సవరించిన ప్రభుత్వం.. పర్యాటకుల విషయంలో ఏం చేస్తుందో చూడాలి.