Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ కోచ్కు మంత్రి రిజుజు ట్వీట్
- సినీ నటి తాప్సీ పన్నుపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ కోచ్ మతియస్ బోయెకు భారత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విదేశీ కోచ్ బోయె ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి స్విస్ ఓపెన్లో ఉన్నాడు. రైతుల ప్రజాస్వామిక నిరసనలకు సినీ నటి తాప్సీ పన్ను మద్దతు తెలపటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించింది. తాప్సీ పన్ను భాగస్వామిగా బోయె ట్విట్టర్ వేదికగా క్రీడా శాఖ మంత్రిని సహాయం కోసం ఆర్థించాడు. ' నేను ఎంతో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను. భారత గొప్ప అథ్లెట్లకు కోచ్గా తొలిసారి స్విస్ ఓపెన్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ఇదే సమయంలో తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ సోదాలు ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులపై అనవసర ఒత్తిడికి కారణం అవుతోంది. ఏదైనా సహాయం చేయండి' అని మతియస్ బోయె ట్వీట్ చేశాడు. ' చట్టమే సుప్రీం, అందరం చట్టానికి లోబడాల్సిందే. తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు మన ఇద్దరి పరిధిలోనిది కాదు. భారత క్రీడల ప్రయోజనాల దృష్ట్యా మన ఇద్దరం ప్రొఫెషనల్ డ్యూటీకి పరిమితం అవుదాం' అని కిరణ్ రిజుజు సమాధానం ఇచ్చాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనురాగ్ కశ్యప్, తాప్సీ ఇంటిపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.