Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్టిన్ గప్టిల్ ధనాధన్
వెల్లింగ్టన్ : ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ పొట్టి సిరీస్ను కైవసం చేసుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 15.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (71, 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. మరో ఓపెనర్ దెవాన్ కాన్వే (36, 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్కు 106 పరుగులు జోడించిన గప్టిల్.. న్యూజిలాండ్కు విజయాన్ని ఖాయం చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0) విఫలమైనా ఆతిథ్య జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. గ్లెన్ ఫిలిప్స్ (34 నాటౌట్, 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. 15.3 ఓవర్లలోనే న్యూజిలాండ్ 143/3తో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాథ్యూ వేడ్ (44, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ అరోన్ ఫించ్ (36, 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మార్కస్ స్టోయినిస్ (26, 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో ఆస్ట్రేలియా 142/8 పరుగులు చేసింది. ఇశ్ సోధి (3/24), సౌథీ (2/38), బౌల్ట్ (2/26)లు రాణించారు. మార్టిన్ గప్టిల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా.. ఇశ్ సోధి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.