Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి వన్డేలో భారత్ ఓటమి
లక్నో : కెప్టెన్ మిథాలీ రాజ్ (50, 85 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (40, 41 బంతుల్లో 6 ఫోర్లు) రాణించినా తొలి వన్డేలో భారత్కు పరాభవం తప్పలేదు. సుమారు 12 నెలలు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న భారత అమ్మాయిలు తొలి మ్యాచ్లో తడబడ్డారు. దక్షిణాఫ్రికా చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం చెందారు. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు లిజెలీ లీ (83 నాటౌట్, 122 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), లారా వాల్వార్ట్ (80, 110 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి సఫారీకి సులువైన విజయం అందించారు. ఓపెనర్ల మెరుపులతో దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో 178/2తో అలవోక విజయం నమోదు చేసింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (2/38) రాణించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 177/9 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు ఇస్మాయిల్ (3/28), మబా (2/40)లు రాణించారు. భారత బ్యాటర్లు జెమీమా రొడ్రిగేజ్ (1), స్మృతీ మంధాన (14), పూనమ్ రౌత్ (10), దీప్తి శర్మ (27), సుష్మ వర్మ (1), జులన్ గోస్వామి (4), మోనిక పటేల్ (4)లు విఫలమయ్యారు. ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో వన్డే లక్నోలోనే మంగళవారం జరుగనుంది.