Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమానుల అనుమతికి బీసీసీఐ నో
- ఆరు నగరాల్లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచులు
- ఏప్రిల్ 9న ఐపీఎల్ 14 సీజన్ ఆరంభం
- మే 30న అహ్మదాబాద్లో అంతిమ సమరం
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 షెడ్యూల్ వచ్చేసింది. ఆరు నగరాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ, కోల్కత నగరాలు వేదికగా ఐపీఎల్ 2021 సీజన్కు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. ఆరు నగరాలు, ఎనిమిది జట్లు, 52 రోజులు, 60 మ్యాచులతో కూడిన ఐపీఎల్14 ఏప్రిల్ 9న చెన్నైలో ఆరంభం కానుంది. అహ్మదాబాద్లో మే 30న ఫైనల్స్తో ముగియనుంది. రెండేండ్ల తర్వాత స్వదేశంలో సందడి చేయనున్న ఐపీఎల్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. ఆరు నగరాల్లోనూ ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచులు జరుగనున్నాయి.
నవతెలంగాణ-ముంబయి
క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాశ మిగిల్చింది. 2019 ఐపీఎల్ సీజన్ తర్వాత మెగా లీగ్కు దూరమైన భారత క్రికెట్ అభిమానులు.. ఐపీఎల్ స్వదేశీ పునరాగమన ఆనందాన్ని కోల్పో నున్నారు. యుఏఈలో జరిగిన ఐపీఎల్ను ప్రత్యక్షంగా చూడలేక పోయిన అభి మానులు.. ఇప్పుడు స్వదేశంలోనూ అదే నైరాశ్యానికి గురి కానున్నారు. ఆరు నగరాలు, 52 రోజులు, 60 మ్యాచులతో షెడ్యూల్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్టేడియంలో అభిమానుల ప్రవేశానికి అనుమతి నిరాకరించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరోనా వైరస్ కేసుల వెలుగు చూడటంతో లీగ్ను అర్థాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్ అనుభవాన్ని గమనంలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న చెన్నైలో ఆరంభమై.. అహ్మదాబాద్లో మే 30న ఫైనల్తో ముగియనుంది.
తటస్థ ఐపీఎల్!
వరుసగా రెండో సీజన్ ఐపీఎల్ తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 దుబారులో జరిగిన సంగతి తెలిసిందే. దుబారు, అబుదాబి, షార్జా నగరాలు వేదికలుగా ఎనిమిది ప్రాంఛైజీలు తటస్థ వేదికల్లో పోటీపడ్డాయి. ఐపీఎల్ భారత్కు తిరిగి రావటంతో ప్రాంఛైజీలు ఇంటా, బయటా మ్యాచులు ఆడే అవకాశం కనిపించింది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్లు తమ ఆతిథ్య నగరాలు ఐపీఎల్ వేదికల్లో లేకపోవ టంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో అన్ని జట్లకూ సొంత మైదానం అను కూలతలను దూరం చేసేందుకు బీసీసీఐ వినూత్న నిర్ణయం తీసుకుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నా.. ఎం.ఎస్ ధోని మాత్రం చెపాక్లో సందడి చేయలేడు. ముంబయి వాంఖడేలో మ్యా చులు షెడ్యూల్ చేసినా.. ముంబయి ఇండియన్స్ అక్కడ ఆడే అవకాశం లేదు. లీగ్ దశలో ప్రతి ప్రాంఛైజీ నాలుగు వేదికల్లో మ్యాచులు ఆడనుంది. చెన్నై, బెంగళూర్, ముంబయి, కోల్కతలు లీగ్ దశలో పదేసి మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అహ్మదాబాద్, న్యూఢిల్లీలు లీగ్ దశలో ఎనిమిదేసి మ్యాచులకు వేదిక కాను న్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్లో ఓవరాల్గా ఎనిమిది డబుల్ హెడర్లు ఉండనున్నాయి. ఆరు జట్లు మూడు మధ్యాహ్నాం మ్యాచులు ఆడ నుండగా.. రెండు జట్లు రెండు మధ్యాహ్నాం మ్యాచులే ఆడనున్నాయి. మధ్యాహ్నాం మ్యాచులు 3.30 గంటలకు ఆరంభం కానుండగా.. సాయంత్రం మ్యాచులు 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి.
ఆదివారం సమావేశమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) షెడ్యూల్ను ఖరారు చేసింది. ఐపీఎల్ ఆతిథ్య నగరాలపై కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ జీసీ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ 14 కోసం బీసీసీఐ ఆరు ఆతిథ్య నగరాల్లో బయో సెక్యూర్ బబుల్స్ సృష్టిం చనున్నారు. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తలపడనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 11న చెన్నైలోనే కోల్కత నైట్రైడర్స్తో ఢతోీ ఐపీఎల్ వేటను ఆరంభించనుంది. అభిమానులకు అనుమతి లేకుండానే సీజన్ ఆరంభం కానున్నా... లీగ్ మధ్యలో పరిస్థితులను సమీక్షించి అభి మానుల ప్రవేశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
జై షా రాజకీయం?!
'వడ్డించే వాడు మనవాడైతే, బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటీ?' అనే నానుడి బీసీసీఐ కార్యదర్శి జై షా చేసి చూపిస్తున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్తో సంబంధం లేకపోయినా, భారత క్రికెట్ బోర్డు రాజకీయాల్లోకి వచ్చిన కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా... ఐపీఎల్ ఆతిథ్య నగరాల ఎంపికలో తన మార్క్ రాజకీయం చూపించాడు. ఇప్పటివరకు భారత జట్టు షెడ్యూల్కు మాత్రమే పరిమితమైన లాబీయింగ్.. తాజాగా ఐపీఎల్కూ పాకింది. వచ్చే ఏడాది అహ్మదాబాద్కు ఓ ఐపీఎల్ ప్రాంఛైజీ అందించేందుకు రంగం సిద్ధం చేసిన జై షా.. సొంత రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు మరో ఏడాది ఓపిక పట్టలేకపోయాడు. కరోనా మహమ్మారి సాకుతో అసలు ఐపీఎల్ ప్రాంఛైజీయే లేని గుజరాత్ రాష్ట్రానికి ఐపీఎల్ మ్యాచులను తరలించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచుల వేదికలు, షెడ్యూల్పై పదునైన విమర్శలు వినిపిస్తున్నాయి.
చెపాక్లో లీగ్ దశలో పది మ్యాచులు జరుగుతాయి. కానీ తంబీలకు ఎం.ఎస్ ధోని దర్శనం దక్కదు. అసలు అక్కడ ఎం.ఎస్ ధోని ఆడనే ఆడడు. వాంఖడేలో లీగ్ దశలో పది మ్యాచులు ఏర్పాటు చేసినా.. ముంబయి ఇండియన్స్ జట్టు అక్కడ సందడి చేయలేదు. ఐపీఎల్ సొంత మైదానం అనుకూలత అనగానే.. సొంత ప్రేక్షకుల నడుమ ఆడటం. అన్ని జట్లకూ ఆ బలం విలువ తెలుసు. మహారాష్ట్రలో మినహా ఎక్కడా కరోనా వైరస్ విజృంభిస్తున్న దాఖలాలు లేవు. అక్కడ సైతం ప్రేక్షకులు లేకుండా లీగ్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమరం ఉన్నప్పటికీ చెన్నై, కోల్కతలు ఐపీఎల్ సందడికి తయారుగా ఉన్నాయి. అయినా, బీసీసీఐ ఈ ఏడాది సీజన్ను పూర్తిగా తటస్థంగా నిర్వహించేందుకు కంకణం కట్టుకుంది. ఆరు నగరాల్లో ఐపీఎల్ను నిర్వహిస్తూ, సొంత మైదానం అనుకూలత లేకపోవటం ఏమిటనే ప్రశ్న సగటు క్రికెట్ అభిమానిని తొలిచి వేస్తోంది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నా... బీసీసీఐ పెద్దలు వినలేదు. భారతీయ జనతా పార్టీ (భాజపా) అధికారంలో లేని మూడు రాష్ట్రాల ఐపీఎల్ ప్రాంఛైజీలకు వారి సొంత నగరాల్లో మ్యాచులను కేటాయించలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్) ఇక్కడ మినహాయింపు లభించింది. సొంత నగరానికి ఐపీఎల్ మ్యాచులను తీసుకెళ్లాలనే జై షా కుటిల మంత్రాంగం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ కళ తప్పనుంది. ప్రాంఛైజీలు సొంత మైదాన భావనకు దూరం కావటంతో పాటు.. ప్రేక్షకులు సైతం అభిమాన జట్టుకు ఛీర్స్ కొట్టేందుకు దూరం కానున్నారు. తటస్థ వేదికల్లోనే నిర్వహించాల్సి వచ్చినప్పుడు పరిమితి వేదికల్లోనే మ్యాచులను నిర్వహించాల్సింది, ఏకంగా ఆరు ఆతిథ్య నగరాలను ఎంపిక చేసి అస్తవ్యస్థంగా షెడ్యూల్ను ప్రకటించటం విమర్శలకు కారణం అవుతోంది. అధికారం అండతో జై షా.. అహ్మదాబాద్కు ఏకంగా 12 మ్యాచులు (8 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్స్) తరలించటం గమనార్హం.