Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ భారీ స్కోరు
- జమ్మూకాశ్మీర్పై సర్వీసెస్ 9 వికెట్లతో ఘన విజయం
ముంబై :తన్మే అగర్వాల్ (118, 10 ఫోర్లు), హనుమ విహారి (8 ఫోర్లు, 1 సిక్స్్) సెంచరీలు చేయడంతో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 434 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హిమాచల్ వికెట్లేమీ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో బాలచందర్ అనిరుధ్ (62, 5 ఫోర్లు), కొల్ల సుమంత్ (53, 8 ఫోర్లు ), అశిష్ రెడ్డి (42, 5 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా రాణించారు. జమ్ముకాశ్మీర్పై సర్వీసెస్ 9 వికెట్లతో తేడాతో గెలుపొందడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. జమ్మూ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 85, 161 పరుగులు చేయగా సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్లో 229, రెండో ఇన్నింగ్స్లో 18/1 పరుగులు చేసి గెలుపొందింది.
బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో వికెట్లేమీ నష్ట పోకుండా 96 పరుగులు చేసింది. అంతకుముందు బరోడా 302 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీతో మ్యాచ్లో హర్యానా రెండో ఇన్నింగ్స్లో 68/2 పరుగులు చేసింది. హర్యానా తొలి ఇన్నింగ్స్లో 195, ఢిల్లీ 237 పరుగులు చేశాయి. గోవాతో మ్యాచ్లో త్రిపుర రెండో ఇన్నిం గ్స్లో 140/6 పరుగులు చేసింది. త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 61, గోవా 257 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్లో జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్లో 47/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో జార్ఖండ్ 202, కేరళ 148 పరుగులు చేశాయి. కర్నాటక తొలి ఇన్నింగ్స్లో 350, విదర్భ 172/2 పరుగులతో ఆడుతోంది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 434 పరు గులు చేయగా ముంబై 45/2తో పరుగులు చేసింది. అస్సాం తొలి ఇన్నింగ్స్లో 92, ఒడిషా 88 పరుగులు చేశాయి. అస్సాం రెండో ఇన్నింగ్స్లో 137/8 పరుగులతో ఆడు తోంది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్లో 375 చేయగా, ఉత్తర ప్రదేశ్ 169/2 పరుగులు చేసింది. గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 467 చేయగా, పంజాబ్ 131/1 పరుగులతో ఆడుతోంది.