Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తానేం చేసినా స్పెషల్గానే ఉండాలని చూసుకుంటారు కావచ్చు. క్రికెట్లో తన బ్యాటింగ్తో వెరీ వెరీ స్పెషల్గా పేరు తెచ్చుకున్న లక్ష్మణ్ తాజాగా పెటా అక్టోబర్ నెలలో శాఖాహారంపై అవగాహన కల్పించేందుకు చిత్రీకరించిన వాణిజ్య ప్రకటనలో నటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 'శాఖాహారం తీసుకోవడం వల్లే నాకు కొత్త శక్తి వచ్చి మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు మెదడు కూడా షార్ప్గా పని చేస్తోంది. జీవితంలో దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు శాఖాహారం తీసుకుంటే మంచిది' అని హితబోధ చేశారు. అంతేకాకుండా తన అభిమానులను కూడా శాఖాహారం మాత్రమే తీసుకోమన్నారు. 'నేను 20 ఏళ్ల పాటు దృఢంగా ఉండి క్రికెట్ ఆడానంటే దానికి కారణం శాఖాహారమే. ముఖ్యమైన విషయమేంటంటే మూగజీవాలను చంపకూడదు' అని లక్ష్మణ్ వెల్లడించారు.