Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ మూడో రౌండ్
న్యూఢిల్లీ : ఈ ఏడాది రంజీ సీజన్లో హర్యానాకు వలసొచ్చిన డ్యాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టుకు మాజీ హోమ్ టీమ్ చేతిలో పరాజయం ఎదురైంది. 244 పరుగుల ఛేజింగ్లో ఉన్ముక్త్ చంద్ రాణించటంతో హర్యానాపై ఢిల్లీ నాల్గు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. గ్రూప్-బిలో తమిళనాడుపై ముంబయిపై వికెట్ తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో తమిళనాడును 95కు ఆలౌట్ చేసిన ముంబయి..ఆఖరి రోజు సునాయాసంగా విజయం సాధించింది. యువరాజ్ సింగ్ (187)గుజరాత్పై భారీ సెంచరీతో చెలరేగినా.. పంజాబ్ డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రైల్వేస్ జట్టు ఉత్తరప్రదేశ్పై..జార్ఖండ్ జట్టు కేరళపై గెలుపొందాయి. గ్రూప్-సిలో హైదరాబాద్ మళ్లీ డ్రాతో సరిపెట్టుకుంది. పేలవ ప్రదర్శన చేసిన హైదరాబాద్పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో హిమాచల్ ప్రదేశ్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. బరోడోతో మ్యాచ్లో ఆంధ్ర జట్టు కూడా డ్రానందం పొందినా..ఆంధ్ర మూడు పాయింట్లు సాధించింది.