Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఛేజింగ్లో టీమ్ ఇండియా చతికిల
- 18 పరుగులతో సఫారీల గెలుపు
- రాణించిన డికాక్, మోర్కెల్
- కోహ్లి శ్రమ వృథా
రాజ్కోట్లో అందివచ్చిన ఆధిక్యాన్ని టీమ్ ఇండియా వదిలేసింది. ఆధునిక క్రికెట్లో ఛేజింగ్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఇద్దరూ క్రీజులో నిలిచినా.. భారత్కు గెలుపు భాగ్యం దక్కలేదు. ఛేజింగ్లో మరోమారు చతికిల పడింది. డికాక్, మోర్కెల్ అద్బుత ప్రదర్శనతో సఫారీలు మ్యాచ్ను లాగేసుకున్నారు. 2-1తో సిరీస్లో ఆధిక్యం సాధించారు.
రాజ్కోట్: టీమ్ ఇండియా ఛేజింగ్లో మరోమారు విఫలమైంది. 270 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (77, 99 బంతుల్లో 5 ఫోర్లు), రోహిత్ (65, 74 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (47, 61 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినా విజయ తీరానికి 18 పరుగుల దూరంలో నిలిచింది. కీలక సమయంలో టాప్ వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్ (4/39) మ్యాచ్ను మలుపుతిప్పాడు. దీంతో భారత్ 252/6 వద్దే నిలిచి పోయింది. అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ (103, 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (60, 63 బంతుల్లో 6 ఫోర్లు) చెలరేగటంతో దక్షిణా ఫ్రికా 270/7 పరుగులు చేసింది. కోహ్లి, ధోని, రహానే వికెట్లు కూల్చిన మోర్కెల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవా ర్డు అందుకున్నాడు. రాజ్కోట్ విజయంతో ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ధావన్ మళ్లీ 271 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (13) మళ్లీ విఫలమయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (65) అర్థ సెంచరీతో కదం తొక్కినా ధావన్ వైఫల్య బాట వీడలేదు. ఆరంభం నుంచీ అసౌకర్యంగా కదిలిన ధావన్..సిరీస్లో రెండోమారు మోర్కెల్కు వికెట్ సమర్పించుకున్నాడు. నెమ్మదిగా ఆరంభమైన భారత్ ఇన్నింగ్స్లో 41 పరుగులకే తొలి వికెట్ పడింది.
విరాట్ కోహ్లి (77) తొలిసారి సిరీస్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. పరుగులు రావటం కష్టంగా మారిన తరుణంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. రెండో వికెట్కు 72 పరుగులు జోడించిన ఈ జోడి ఛేజింగ్లో ధీటైన సమాధానం ఇచ్చింది. భారీ సిక్సర్తో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. డుమినికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ నిష్క్రమణతో నాల్గోస్థానంలో వచ్చిన కెప్టెన్ ధోని (47) కోహ్లితో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో బంతికో రన్ చేసిన ధోని.. తర్వాత తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 80 పరుగులు జోడించినా.. రన్రేట్ను అదుపులో ఉంచలేకపోయారు. భారీ షాట్లకు యత్నించి విఫలమైన ఈ జోడి..చాలా సార్లు సమన్వయం లేక ఇబ్బంది పడ్డారు.
మోర్కెల్ మాయ ముగింపు మొనగాళ్లు కోహ్లి, ధోని క్రీజులో ఉండటంతో సాధించాల్సిన రన్రేట్ భారీ గా ఉన్నా.. విజయంపై భారత్ ధీమాగా కనిపించింది. కానీ మోర్కెల్ ఓ అద్బుత ఓవర్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. తొలుత ధోని షార్ట్ బాల్తో పడగొట్టిన మోర్కెల్..తర్వాతి ఓవర్లో కోహ్లి, రహానే (4)లను వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చాడు. సురేశ్ రైనా (0) అప్పటికే డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో సఫారీల విజయం లాంఛనమే అయ్యింది. అక్షర్ (15), భజ్జీ (20) పోరాడినా ఓటమి అంతరాన్ని తగ్గించారే తప్పితే గెలుపించలేకపోయారు.
ఆరంభం అదుర్స్ టాస్ నెగ్గి బ్యాటింగ్కు ఎంచు కున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (103, 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మిల్లర్ (33) అదిరే ఆరంభం అందించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్గా ప్రమోటైన మిల్లర్ డికాక్కు చక్కటి సహ కారం అందించాడు. మోహిత్, భువీని టార్గెట్ చేసుకున్న బౌండరీలు బాదిన డికాక్ సఫారీ ఇన్నింగ్స్కు ఊపుతెచ్చాడు. భువీ ఓవర్లో మిడ్ ఆఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదిన డికాక్..ప్రమాద సంకేతాలిచ్చాడు. మోహి త్ ఓవర్లో వరుస బౌండరీలు బాదిన మిల్లర్ అదే ఓవర్లో పెవిలియన్ దారి పట్టాడు. డికాక్కు జత కలి సిన ఆమ్లా (5) ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. మిశ్రా బౌలింగ్లో ధోని చాకచక్యంగా స్టంప్ చేసి..రెండో వికెట్ కూలగొట్టాడు. అప్పటికీ దక్షిణాఫ్రికా స్కోరు 87/2.
డికాక్, డుప్లెసిస్ షో సిరీస్లో నిలకడగా రాణి స్తోన్న డుప్లెసిస్ (60, 63 బంతుల్లో 6 ఫోర్లు) మరో అర్థ సెంచరీ నమోదు చేశాడు. డికాక్తో కలిసి మూడో వికెట్కు 118 పరుగులు జోడించిన డుప్లెసిస్ సఫా రీలను భారీ స్కోరు దిశగా నడిపాడు. అద్బుతమైన స్ట్రోక్ ప్లేతో ఆడిన డికాక్ 114 బంతుల్లో సెంచరీ మార్క్ చేరు కున్నాడు.టీమ్ ఇండియా స్పిన్, పేస్ను సమర్ధవంతం గా ఎదుర్కొన్న ఈ జోడిని మోహిత్ శర్మ విడగొట్టాడు. తర్వాతి ఓవర్లోనే డికాక్ రనౌట్గా వెనుదిరిగాడు. స్టార్ బ్యాట్స్మన్ డివిలియర్స్ (4)ను అక్షర్పటేల్ కట్టడి చేశాడు. వచ్చీరాగానే ఎబిని ఎల్బీగా ఔట్ చేసిన అక్షర్.. సఫారీలు భారీ స్కోరు చేయకుండా నిలువరించాడు. వరుసగా మూడు ఓవర్లలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. 205/2 స్థితి నుంచి 210/5కు చేరుకుంది. ఆఖర్లో డుమిని (14) మెరవకపోయినా..బెహార్డిన్ (33) సఫారీలకు 270 స్కోరు అందించాడు. ఆఖరి రెండు ఓవర్లలో 23 పరుగులు చేసిన సఫారీలు..మెరుగైన టార్గెట్ను నిర్దేశించారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : డికాక్ రనౌట్ (ధావన్/ధోని) 103, మిల్లర్ (సి) రహానే (బి) హర్బజన్ 33, ఆమ్లా (స్టంప్డ్) 5, డుప్లెసిస్ (సి) భువనేశ్వర్ (బి) మోహిత్ 60, డివిలియర్స్ (ఎల్బి) అక్షర్ పటేల్ 4, డుమిని (సి) రైనా (బి) మోహిత్ 14, బెహార్డిన్ నాటౌట్ 33, స్టెయిన్ రనౌట్ 12, రబాడ నాటౌట్ 0, ఎక్స్ ట్రాలు : 6, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 270.
వికెట్ల పతనం : 172, 2-87, 3-205, 4-210, 5-210, 6-241, 7-264.
బౌలింగ్ : భువనేశ్వర్ 10-1-65-0, మోహిత్ 9-0-62-2, హర్బజన్ 10-0-41-1, మిశ్రా 10-0-38-1, అక్షర్ 9-0-51-1, రైనా 2-0-13-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి,బి) డుమిని 65, శిఖర్ ధావన్ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 13, విరాట్ కోహ్లి (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 77, ధోని (సి) స్టెయిన్ (బి) మోర్కెల్ 47, రైనా (సి) మిల్లర్ (బి) తాహిర్ 0, రహానే (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 4, అక్షర్ నాటౌట్ 15, హర్బజన్ నాటౌట్ 20, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 6 వికెట్లకు) 252.
వికెట్ల పతనం : 1-41, 2-113, 3-193, 4-206, 5-216, 6-216.
బౌలింగ్ : స్టెయిన్ 10-0-65-0, రబాడ 10-0-39-0, మోర్కెల్ 10-1-39-4, డుమిని 8-0-46-1, తాహిర్ 10-0-51-1, బెహార్డిన్ 2-0-9-0.