Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : శనివారం అబుదాబి టెస్టు లో వెలుతురు సరిగా లేని కారణంగా చివరి రోజు 8 ఓవర్లు మిగిలుండగానే పాకిస్తాన్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ను నిలిపేశారు. మరో 25 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలిచేదే. దీంతో మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి ఐసిసి టెస్టుల్లో గ్రీన్-ఎల్లో రంగుల్లో ఉన్న బంతులను వినియోగించే యోచనలో ఉంది. ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ మాట్లాడుతూ 'వెలుతురు సరిగా లేనపుడు, ఫ్లడ్లైట్ల వెలుతురులో రెడ్ బంతులకు బదులుగా పింక్, గ్రీన్-ఎల్లో బాల్స్తో ఆడడం సులువుగా ఉంటుంది' అని తెలిపారు. నవంబర్ 27న ఆసీస్- న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి డే నైట్ టెస్టులో కూడా పింక్ బాల్స్ను వాడబోతున్నారు.