Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత టెన్నిస్ యువ కెరటం యూకీ బాంబ్రీ కెరీర్లో తొలిసారి వందలోపు ర్యాంకు సాధించి అరుదైన ఘన తను సొంతం చేసుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో అతడు 99వ ర్యాంకులో నిలిచాడు. అంతేకాకుండా 2010 తర్వాత భారత్ నుంచి టాప్ 100లో ర్యాంకు పొందిన తొలి ఆటగాడిగా, దశాబ్దంలో మూడో ఆటగాడిగా కూడా యూకీ రికార్డుల్లోకి ఎక్కాడు. యుకీ చివరి మూడు టోర్నమెంట్లలో ప్రశంసాత్మకమై ఆటతీరు కనబర్చాడు. తష్కెంట్ ఓపెన్లో సెమీ ఫైనల్ వరకు వెళ్లగా తైవాన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. ఇక షాంఘై ఓపెన్ సిరీస్లో విజయం సాధించాడు. టాప్-100 ర్యాంకు ఇచ్చిన ఆత్మవిశ్వా సంతో ఉన్న యూకీ అక్టోబర్ 26 నుంచి జరిగే పూణె చాలెం జర్ సిరీస్లో బరిలోకి దిగనున్నాడు. మహిళల డబుల్స్లో సానియా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతోంది.