Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ నిర్ణయాక
- మూడో టీ20 నేడు
- జోరుమీదున్న ధోనీసేన
- ఆశల పల్లకిలో శ్రీలంక
విశాఖపట్టణం-నవతెలంగాణ
పుణె పరాజయం అనంతరం ఏకపక్ష విజయంతో సత్తా చాటిన టీమ్ ఇండియా.. సిరీస్ నిర్ణయాక మ్యాచ్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ లైనప్లో అందరూ జోరుమీదుండటంతో.. మరోమారు భారీ స్కోరుపై భారత్ కన్నేసింది. బ్యాట్స్మెన్ దూకుడుతో విశాఖలో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా..టీ20 ప్రపంచకప్ రెండో సన్నాహకంలోనూ జయకేతనం ఎగుర వేయాలని ఎదురుచూస్తోంది. 1-1తో శ్రీలంక, భారత్లు సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో విశాఖ మ్యాచ్లో సిరీస్ తీరానికి చేరేదెరో..!!
ఓ చెత్త ఓటమి.. వెన్వెంటనే బ్రహ్మాండమైన విజయం. ఇదీ తొలి రెండు టీ20ల్లో టీమ్ ఇండియా ప్రదర్శన. ధోనీ ఇలాకాలో భీకర ఫామ్లోకి వచ్చిన భారత్.. సిరీస్ విజేతను తేల్చనున్న విశాఖ మ్యాచ్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. రాంచీలో కనీస పోటీ సైతం ఇవ్వలేని స్థితిలో దారుణ ఓటమిని చవిచూసిన లంకేయులు.. విశాఖ మ్యాచ్పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తిరుగులేని ప్రదర్శన గావించిన మహి సేన ఆఖరి మ్యాచ్లోనూ అదే జోరు పునరావృతం చేయాలని భావిస్తోంది. టీ20 వరల్డ్కప్కు శ్రీలంక జట్టును ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో.. కుర్రాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఎదురుచూస్తున్నారు. మూడో టీ20 మ్యాచ్ రాత్రి. 7.20 గంటలకు ఆరంభం కానుంది.
యువీ ఒక్కడే : స్టార్ బ్యాట్స్వన్ విరాట్ కోహ్లి లేకపోయినా.. టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంది. శిఖర్ ధావన్ కెరీర్లో తొలి అర్ధ సెంచరీ (టీ20లో)తో మెరవగా.. యువ
కెరటం హార్థిక్ పాండ్య తనెంటో నిరూ పించుకు న్నాడు. రోహిత్ శర్మ, అజింక్య రహానె, సురేశ్ రైనా సహా కెప్టెన్ ధోని మంచి టచ్లో ఉన్నారు. కానీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఇంకా ఆత్మవిశ్వాసం సాధించినట్టుగా లేడు. ఫీల్డింగ్లో పాదరసంలా కదులుతూ పాత రోజుల్ని గుర్తు చేస్తున్న యువీ.. బ్యాట్తో మాత్రం ఆ పని చేయటం లేదు. రాంచీలో యు వీని కాదని పాండ్యను పంపిన ధోని.. ఆ దిశగా సక్సెస్ సాధించినా యువరా జ్కు మెరుగైన అవ కాశం దక్కాల్సి వుందనే విషయం వాస్తవం.
బౌలింగ్ వనరులను వినియోగించుకోవటంలో మహి కొత్తగా కనిపించాడు. రాంచీలో కొత్త వ్యూహం అనుసరించిన మహి.. మిడిల్ ఓవర్లలో పార్ట్ టైమర్ బౌలర్లను ఉపయోగించుకున్నాడు. స్లాగ్ ఓవర్లలో యార్కర్లు అద్బుతంగా సంధించే బుమ్రాను బరిలోకి దించాడు. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. ట్రంప్ కార్డ్ అశ్విన్ మెరుపు ప్రదర్శన విశాఖలోనూ కొనసాగితే పర్యాటక జట్టుకు సిరీస్ ఓటమి లాంఛనమే కానుంది.
దిల్షాన్ రాణిస్తేనే : శ్రీలంక జట్టులో ఉన్న సీనియర్ డ్యాషింగ్ బ్యాట్స్మన్ తిలకరత్నే దిల్షాన్.. ఆరంభంలో శుభారంభం అందిస్తే కుర్రాళ్లకు దారి చూపించనవాడవుతాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లంకేయులు.. ఆఖరి మ్యాచ్లో ఓపెనర్ నిరోశన్ డిక్వాలాకు మరో అవకాశం ఇవ్వనుంది. చండిమాల్, కపుగెదెర, సిరివర్థనలు దూకుడుగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బౌలింగ్ విభాగంలో రజిత కు తోడు చమీర శ్రీలంకను ముందుండి నడిపించనున్నారు. రాంచీలో ఓడినా..చమీరా ప్రదర్శన విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంది. కీలక మ్యాచ్లో అంచనాలకు తగినట్టు ఆడాలని కుర్రాళ్లు సైతం ఎదురుచూస్తున్నారు.
బ్యాటింగ్ పిచ్ : రాంచీ తర్వాత ధోని సేనకు మరో ఫ్లాట్ పిచ్ ఎదురుకానుంది. సహజంగానే బ్యాటిం గ్కు అనుకూలించే వైజాగ్ పిచ్పై నేటి మ్యాచే తొలి టీ20. గతంలో ఇక్కడ ఆడిన ఐదు మ్యా చుల్లో నాలుగింట భారత్ విజయం సాధిం చింది. కెప్టెన్ మహికి ఇక్కడ ఘనమైన రికార్డు ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది.
నేరుగా బరిలోకి : రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్టణానికి చేరుకున్న భారత్, శ్రీలంక ఆటగాళ్లు హౌటల్ గదులకే పరిమితమయ్యారు. ఆదివారం ఉదయం కూడా ప్రాక్టీస్ సెషన్కు వచ్చే అవకాశం లేదు. దీంతో నేరుగా నేటి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెండు జట్లు స్టేడియానికి రానున్నట్టు సమాచారం. విశాఖలో తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున్న భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనరు, డిప్యూటీ కలెక్టర్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, సురేశ్ రైనా, ధోని, యువరాజ్ సింగ్, హార్థిక్ పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, ఆశీష్ నెహ్రా.
శ్రీలంక : డిక్వాలా, దిల్షాన్, చండిమాల్, కపుగెదెర, శనక, సిరివర్థన, పెరీరా, సేననాయకే, చమీర, వాండర్సే, రజిత.
భారత్, శ్రీలంక మూడో టీ20
వేదిక : వైజాగ్
సమయం : రాత్రి 7.20 గం||లకు
స్టార్స్పోర్ట్స్1,3లలో ప్రసారం