Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ అథ్లెట్లకు ఇక్కడేం సమస్యల్లేవ్
- దక్షిణాసియా క్రీడల పాక్ చీఫ్
గౌహతి : భారత్లో పర్యటించే పాకిస్తాన్ అథ్లెట్లకు భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ఇటీవల కాలంలో ఆ దేశం ఎక్కువగా ఆరోపిస్తున్న నేపథ్యంలో.. పొరుగు దేశంలో లభిస్తున్న ఆతిథ్యం పట్ల పాక్ మాజీ హాకీ ఆటగాడు ఇస్లాహుద్దీన్ సిద్దిఖీ ఆనందం వ్యక్తం చేశాడు. భారత్లో జరుగుతున్న 12వ దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ జట్టు చీఫ్ డి మిషన్గా వ్యవహరిస్తున్న సిద్దిఖీ ఇక్కడ పాక్ అథ్లెట్లకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. ' సాగ్ కోసం ఇక్కడికి వచ్చినపట్నుంచి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. గౌహతి, షిల్లాంగ్లో అద్భుతమైన ఆతిథ్యం ఇస్తున్నారు' అని సిద్దిఖీ పేర్కొన్నారు. భారత్లో పాక్ అథ్లెట్ల భద్రతపై పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ వాషింగ్టన్లో జరిగిన నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ సమావేశంలో ప్రస్తావించింది. ఐతే టోర్నీకి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయి జట్టును పంపించింది. భద్రతా కారణాల రీత్యా మార్చిలో భారత్ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనటంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిద్దిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.