Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు తప్పని భంగపాటు
-స్వల్ప స్కోర్ల మ్యాచ్లో పోరాడి ఓడిన కుర్రాళ్లు
-అండర్-19 వరల్డ్కప్
కష్టాల్లో ఉన్న కరీబియన్ జట్టుకు.. కుర్రాళ్లు ప్రపంచ కప్ విజయంతో సరికొత్త ఉత్సాహన్ని నింపారు. స్వల్ప స్కోర్లు నమోదైన ఫైనల్లో పైచేయి సాధించిన విండీస్ కుర్రాళ్లు.. వెస్టిండీస్కు తొలి అండర్-19 ప్రపంచకప్ను తీసుకెళ్లారు. రికార్డు స్థాయిలో నాల్గో ట్రోఫీపై కన్నేసిన యువ భారత్కు విండీస్ జోరుతో భంగపాటు తప్పలేదు. విండీస్కు చారిత్రాత్మక ప్రపంచకప్ను అందించిన కుర్రాళ్లు.. తమదైన శైలిలో నృత్యాలు చేస్తూ విజయాన్ని ఆస్వాదించారు.
మీర్పూర్ : అండర్-19 ప్రపంచకప్ ఈ మారు కొత్త జట్టు చెంతకు చేరింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన విండీస్ కుర్రాళ్లు.. తొలిసారి కుర్ర కప్పు చాంపి యన్గా నిలిచారు. భారత్ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులుండానే ఛేదించిన వెస్టిండీస్.. అండర్-19 నయా చాంపియన్గా అవ తరించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' కిశీ కార్టీ (52, 125 బంతుల్లో 2 ఫోర్లు), పాల్ (40, 68 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆరో వికెట్కు అజేయంగా 69 పరుగులు జోడిం చి వెస్టిండీస్ను విజయ తీరాలకు చేర్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాట్స్మెన్ అందరూ విఫలం కాగా సర్ఫ రాజ్ ఖాన్ ( 51, 89 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టు స్కోరును 100 మార్క్ దాటించాడు. ఐదో సారి ఫైనల్లో తలపడిన భారత్.. రెండోమారు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్యాట్స్మెన్ ఫెయిల్ : టైటిల్ పోరులో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. విండీస్ వికెట్ కీపర్ ఇమ్లాచ్ (రివర్స్ మన్కడింగ్) మెరుపు వేగంతో ఓపెనర్ రిషబ్ పంత్ (1)ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో ఇన్నింగ్స్ నాల్గో బంతికే భారత్ తొలి వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4) ఫైనల్లో వైఫల్య యాత్ర కొనసాగించాడు. నాకౌట్ మ్యాచుల్లో ఆకట్టుకున్న అన్మోల్ప్రీత్ సింగ్ (3) వచ్చీ రాగానే పెవిలియన్ చేరాడు. కిషన్, సింగ్ ఇద్దరినీ జోసెఫ్ పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో 27/3తో భారత్ కష్టాల్లో పడింది. ఆరం భంలో లభించిన బ్రేక్ను కొనసాగించిన విండీస్ బౌలర్లు బ్యాట్స్మెన్ను క్రీజులో కుదురుకునే సమయం ఇవ్వలేదు. వాషింగ్టన్ సుందర్ (7), ఆర్మన్ జాఫర్ (5)లు సైతం వెన్వెంటనే క్రీజును వదిలి వెళ్లారు. దీంతో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ 100 మార్క్ చేరుకోవటం సైతం గగనమే అనిపించింది.
ఆదుకున్న సర్ఫరాజ్ : ఈ దశలో క్రీజు లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (51) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. రాహుల్ బాథమ్ (21), మయాంక్ లామ్రోర్ (19)లతో కలిసి జట్టు స్కోరును నెమ్మదిగా ముందుకు నడిపించాడు. పరిస్థితులకు తగినట్టు బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ విండీస్ను కాస్త నిలువరించే ప్రయత్నం చేశాడు. తోకను సైతం శరవేగంగా కత్తిరించేసిన విండీస్.. భారత్ను 145 పరుగులకే పరిమితం చేసింది.విండీస్ బౌలర్లలో జోసెఫ్ (3/39), జాన్ (3/38)లకు తోడు కీమో పాల్ (2/17) భారత్ పతనాన్ని శాసించాడు.
మనోళ్లూ మెరిసినా.. : స్వల్ప లక్ష్యాన్ని కాచుకోవటంలో భారత బౌలర్లూ అద్భు తంగా బౌలింగ్ చేశారు. అవేశ్ ఖాన్ ఆరం భంలోనే ప్రమాదకర ఓపెనర్ పోప్ (3)ను ఔట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ మరో ఓపెనర్ ఇమ్లాచ్ (15)ను పెవిలియన్కు చేర్చాడు. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బంతులేసిన బౌలర్లు.. పరుగులు రాకుండా జాగ్రత్త పడ్డారు. శిమ్రోర్ హెట్మేర్ (23) టాప్ ఆర్డర్లో రాణించిన ఏకైక బ్యాట్య్మన్. విండీస్ను సైతం 77/5 స్థితికి చేర్చిన బౌలర్లు.. భారత్ను రేసులోకి తీసుకొచ్చారు.
ఆ ఇద్దరే.. : తొలి 30 ఓవర్లలో టైటిల్ రేసులో నిలిచిన భారత్..కీశీ కార్టీ (52), కీమో పాల్ (40) సమయోచిత భాగస్వా మ్యంతో ట్రోఫీపై ఆశలు వదులుకుంది. రెట్టించిన ఉత్సాహంతో బంతులేస్తున్న బౌలర్లను వీరిద్దరూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సాధించాల్సిన రన్రేట్ సైతం స్వల్పమే కాబట్టి.. ప్రశాంతంగా ఆడారు. ఎక్కడా భారీ షాట్లకు వెళ్లలేదు. ఒక్కో పరుగే స్కోరు బోర్డుకు చేర్చిన పాల్, కార్టీలు ఆఖరు వరకూ అదే శైలిలో ఆడారు. ఆఖరు రెండు ఓవర్లలో 9 పరుగులు చేయాల్సిన దశలోనూ సావధానంగానే సాధించారు. పాల్ గెలుపు పరుగు పూర్తి చేయగానే.. విండీస్ కుర్రాళ్లు సంబారాల్లో మునిగిపోయారు. ఆల్రౌండర్ స్ప్రింగర్ విలక్షణ నృత్యంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.
భారత్ ఇన్నింగ్స్ : 145/10 ( సర్ఫ రాజ్ ఖాన్ 51, రాహుల్ 21, మహిపాల్ 19, జోసెఫ్ 3/39, జాన్ 3/38)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 146/5 ( కీశీ కార్టీ 52, కీమో పాల్ 40, సిమ్రోన్ 23, మయాంక్ 3/25, అవేశ్ ఖాన్ 1/29)