Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక 82 ఆలౌట్
- అదరగొట్టిన అశ్విన్
- టీ20 సిరీస్ ధోనీసేన వశం
- విశాఖలో టీమ్ ఇండియా ఘన విజయం
ఆఖరి పంచ్ అదిరింది. ఫ్లాట్ పిచ్పై స్పిన్నర్లు చెలరేగిన వేళ.. శ్రీలంకను 82 పరుగులకే కుప్పకూల్చిన టీమ్ ఇండియా టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. ట్రంప్ కార్డ్ అశ్విన్ అద్భుత ప్రదర్శన మెరవగా.. జడేజా, రైనా సైతం మాయ చేసేశారు. నిర్ణయాక విశాఖ మ్యాచ్లో ఘనమైన విజయాన్ని దక్కించుకున్న ధోనీసేన.. టీ20 ప్రపంచ కప్ సన్నాహకం-2లోనూ సక్సెస్ సాధించింది. 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ ఇండియా.. టీ20 ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానం చేజిక్కించుకుంది. ఆసీస్, శ్రీలంకపై వరుస సిరీస్ విజయాలు నమోదు చేసిన భారత్.. తర్వాతి లక్ష్యం ఆసియా కప్ ట్రోఫీయే.!
వైజాగ్ నుంచి నవతెలంగాణ స్పోర్ట్స్ కరస్పాండెంట్
టీమ్ ఇండియా చేతికి మరో పొట్టి సిరీస్ చిక్కింది. నిర్ణయాక మ్యాచ్లో కళ్లు చెదిరే ప్రదర్శన చేసిన ధోనీసేన విశాఖలో విజయఢంకా మోగిం చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (46, 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో ఛేదించిన భారత్ 2-1తో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఫ్ స్నిన్నర్ అశ్విన్(4/8) స్పిన్ మాయజాలంతో తొలుత శ్రీలం కను 82 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. విజ యాన్ని లాంఛనం చేసేసింది. శ్రీలంక టీ20 చరిత్ర లోనే అత్యల్ప స్కోరుకు పరిమితం కాగా.. ఆతిథ్య జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ఇది వరుసగా రెండో సిరీస్ విజయం నమోదు చేసింది. ఆఖరు రెండు మ్యాచుల్లో విజృంభించిన రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను దక్కించుకున్నాడు.
మళ్లీ మెరిసిన ధావన్ : 83 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా ఎంతో ప్రశాం తంగా కనిపించింది. ఏ దశలోనూ రిస్క్ తీసుకోని ఓపెనర్లు..భారత్కు శుభారంభాన్ని అందిం చారు. రోహిత్ శర్మ (13, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), శిఖర్ ధావన్ (46, 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో ధాటిగా ఆడి శ్రీలంక ఆశల్ని ఆవిరి చేశారు. వికెట్కు రెండు వైపులా బంతిని బాదిన ఓపెనర్లు.. శ్రీలంక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. చమీర బౌలింగ్లో రోహిత్ వెనుదిరిగినా అజింక్య రహానె (22, 24 బంతుల్లో 1 ఫోర్) ధావన్తో కలిసి లాంఛనాన్ని ముగించాడు. మరోమారు జట్టును మందుండి నడిపించిన శిఖర్ ధావన్.. ఆఖరు వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆరంగ్రేట సీమర్ గుణరత్నే వేసిన 14 ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన ధావన్ లాంఛ నాన్ని ముగించాడు. ధావన్ మెరుపులతో భారత్ 13.5 ఓవర్ల నే విజయాన్ని అందుకుంది. శ్రీలంక బౌలర్లలో చమీర ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
ముందు నుంచే ముంచేశారు : టాస్ నెగ్గి శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.. ఆ దిశగా గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్లు డిక్వాలా (1), దిల్షాన్ (1)లను ఔట్ చేసిన అశ్విన్ ఆతిథ్య జట్టుకు ఘనమైన ఆరం భాన్ని అందించాడు. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. విచిత్రంగా ఆత్మరక్షణ ధోరణి లో కాకుండా ఎదురుదాడికి ప్రయత్నించింది. కానీ అశ్విన్ తన తర్వాతి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆర్డన్ను డగౌట్కు చేర్చాడు. సిరివర్దనేను ఆశీష్ నెహ్రా పడగొట్టగా.. 21/5తో శ్రీలంక రికార్డు పతనానికి చేరువైంది. యువరాజ్ సింగ్ ఓవర్లో రెండు భారీ సిక్స్ర్లు సంధించిన శనక (19) లంక ఇన్నింగ్స్కు కాస్త ఊపు తెచ్చాడు. కానీ జడేజా, రైనా సైతం రెచ్చిపోవటంతో లంక వెన్వెంటనే 9 వికెట్లు చేజార్చుకుంది. సురేశ్ రైనా రెండు వికెట్లతో మెరవగా.. ఆఖరి వికెట్ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదే స్వల్ప స్కోరు : విశాఖ మ్యాచ్లో శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి వరల్డ్ రికార్డు కొడుతుందనుకున్న శ్రీలంక.. కాసింత పుంజుకుని 82 పరుగులు చేయగల్గింది. టీ20 ఫార్మాట్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు. టీమ్ ఇండియా స్పిన్నర్ల మాయలో పడిపోయిన లంకేయులు 18 ఓవర్లలోనే కుప్పకూలి.. ఈ రికార్డును కొనితెచ్చుకున్నారు.
అశ్విన్ మాయ : విశాఖలో టీమ్ ఇండి యా ట్రంప్ కార్డ్ అశ్విన్ (4/8) కళ్లుచెదిరే ప్రదర్శనతో అదరగొట్టే శాడు. భారత బౌలింగ్ దాడిని మొదలెట్టిన అశ్విన్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో శ్రీలంకను కుదేల్ చేశాడు. టాప్ ఆర్డర్లో నలుగురు బ్యాట్స్మెన్ డిక్ వాలా (1), దిల్షాన్ (1), చండిమాల్ (8), గుణరత్నే (4)లను పెవిలియన్ దారి పట్టించిన అశ్విన్ 20/4తో పర్యాటక జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. విశాఖలో పూర్తిగా కొత్తగా కనిపించిన అశ్విన్.. ఆర్మ్ బంతితో లంకేయు లను తికమక పెట్టాడు. చక్కని బౌన్స్ రాబట్టిన అశ్విన్ బంతిని లంకేయులు అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారు. 8 పరుగులే ఇచ్చి నాలుగు ప్రధాన వికెట్లు పడగొట్టిన అశ్విన్.. విశాఖ విజయంలో కీలక భూమిక వహించాడు.
సరసమైన సన్నాహం
ఆసియా కప్కు ముందు టీమ్ ఇండియా పర్ఫెక్ట్ విజయాన్ని అందుకుంది. ఆసీస్పై 3-0తో తిరుగులేని విజయాన్ని సాధించిన ధోనీసేన సొంతగడ్డపై లంకేయులను 2-1తో ఓడించింది. మరో పది రోజుల్లో ఆసియా సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో వరుస సిరీస్ విజయాలు.. టీమ్ ఇండియా విశ్వా సాన్ని పెంపొందించేవే. విరాట్ కోహ్లి లేకపోయినా.. బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోని ధోనీసేన.. బౌలింగ్ విభాగంలో మరింత రాటుదేలింది. యువ కెరటం జశ్ప్రీత్ బుమ్రా నిలకడగా యార్కర్లు సంధిస్తూ ఈ ఫార్మాట్లో నమ్మదగిన సీమర్గా ఎదిగాడు. వెటరన్ నెహ్రా సైతం ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా తాము చేయదగిన దాని కంటే ఎక్కువే చేశారని చెప్పవచ్చు. చాన్నాండ్ల తర్వాత జట్టు లో ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషించటం శుభపరిణామం. హార్థిక్ పాండ్య తాజా సిరీస్లో తనెంటో నిరూపించు కున్నాడు. పార్ట్టైమ ర్లుగా రైనా, యువీలు జట్టుకు ఉపయుక్తంగా మారారు. అన్ని విభాగా ల్లోనూ భారత్ ఎంతో మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లైనప్లో ధావన్ ఫామ్లోకి రావటం సానుకూలాంశం. ధావన్ ఇదివరకూ టీ20 ఎన్నడూ ఫీఫ్టీ మార్క్ చేరు కోని ధావన్.. బ్యాటింగ్ ఆర్డర్లో ముం దుండి నడిపించటం ఆకట్టుకునే విషయం. జట్టులో ఆందోళన కల్గిస్తున్న విషయం యువీ బ్యాటిం గ్ ఒక్కటే. ఈ సిరీస్లో అతడికి అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. ఇక చివరగా ఆసియా, ప్రపంచ కప్ సమరానికి ముందు యువ లెఫ్టార్మ్ స్పిన్న ర్ పవన్ నేగీకి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఓవరాల్గా ఏకపక్ష విజయా లతో ఆధిపత్యం చాటుకున్న టీమ్ ఇండి యా.. ఆసియా కప్కు ముందు పర్ఫెక్ట్ విజ యాన్ని అందుకోవటంతో పాటు కొండంత ఆత్మ విశ్వాసాన్ని ప్రోదిచేసుకోవటం శుభపరిణామం.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్ : నిరోశన్ డిక్వాలా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 1, తిలకరత్నే దిల్షాన్ (ఎల్బీ) అశ్విన్ 1, దినేశ్ చండిమాల్ (సి) పాండ్య (బి) అశ్విన్ 8, గుణరత్నే (సి) రైనా (బి) అశ్విన్ 4, సిరివర్ధన (బి) నెహ్రా 4, దశున్ శనక (బి) జడేజా 19, ప్రసన్న రనౌట్ (జడేజా) 9, తిశార పెరీరా (సి) జడేజా (బి) రైనా, సేననాయకే (సి) ధోని (బి) రైనా , చమీర నాటౌట్ 9, దిల్హర ఫెర్నాండో (బి) బుమ్రా 1, ఎక్స్ట్రాలు : 6, మొత్తం : (18 ఓవర్లలో ఆలౌట్) 82.
వికెట్ల పతనం : 1-2, 2-3, 3-12, 4-20, 5-21, 6-48, 7-54, 8-72, 9-73, 10-82.
బౌలింగ్ : అశ్విన్ 4-1-8-4, ఆశీష్ నెహ్రా 2-0-17-1, జశ్ప్రీత్ బుమ్రా 3-0-10-1, జడేజా 4-1-11-1, యువరాజ్ 1-0-15-0, హార్థిక్ పాండ్య 2-0-15-0, సురేశ్ రైనా 2-0-6-2.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (ఎల్బీ) చమీర 13, శిఖర్ ధావన్ నాటౌట్ 46, అజింక్య రహానె నాటౌట్ 22, ఎక్స్ట్రాలు : 3, మొత్తం : (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84.
వికెట్ల పతనం : 1-29.
బౌలింగ్ : సేననాయకే 4-0-22-0, ఫెర్నాండో 2-0-7-0, చమీర 2-0-14-1, ప్రసన్న 1-0-3-0, సిరివర్ధన 1-0-9-0, గుణరత్నే 2.5-0-22-0, దిల్షాన్ 1-0-4-0.