Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనా గైర్హాజరీతో ఒత్తిడిలో భారత్
- ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ నేటి నుంచే ఆరంభం కానుంది. గచ్చీబౌలిలోని ఇండోర్ స్టేడియం.. బ్యాడ్మిం టన్ సమరానికి వేదిక కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ లోనూ ముందు నుంచీ ఆసియా దేశాలదే హవా.. అలాం టి ఆసియా దేశాలదే టోర్నీ ఐనప్పుడు పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. మహిళలు, పురుషుల జట్టు విభాగాలుగా జరుగనున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారత్ సహా చైనా, మలేషియా, జపాన్, థారులాండ్, హాంగ్కాంగ్, శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, చైనీస్ తైపీ, మాల్దీవులు పాల్గొననున్నాయి.
క్లిషమైన గ్రూప్లో.. : మెన్స్, వుమెన్స్ రెండు విభాగాల్లోనూ భారత్కు కఠినమైన డ్రానే ఎదురైంది. మహిళల జట్టు బలమైన ప్రత్యరు జపాన్, మలేషియాలున్న గ్రూప్లో చోటు చేసుకుంది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయంతో టోర్నీకి దూరం కాగా.. యువ షట్లర్ పి.వి సింధు, డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు భారత్ను ముందుండి నడిపించనున్నారు. యువ ప్లేయర్స్ రుత్విక, మనీశ, సిక్కి రెడ్డి, పి.సి తులసీలు సైతం జట్టులో ఉన్నారు. బుధవారం జపాన్తో పోరుతో భారత్ టైటిల్ వేట ఆరంభించనుంది. పురుషుల జట్టు సైతం కఠిన ప్రత్యర్థులతోనే తలపడాల్సి వుంది. మలేషియా, చైనాలతో శ్రీకాంత్ సేన పోరాడనుంది. ఫిట్నెస్ సమస్యలతో దక్షిణాసియా క్రీడలకు దూరమైన సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్...ఆసియా పోరుకు జట్టులోకి వచ్చాడు. కిడాంబి శ్రీకాంత్, అజరు జయరాం, ప్రణరులు సింగిల్స్లో బరిలోకి దిగనున్నారు. ' స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లేని వేళ వచ్చిన అవకాశాన్ని యువ తరం సద్వినియోగం చేసుకోవాలి. మెన్స్ విభాగంలో కశ్యప్ జట్టులో ఉన్నా.. శ్రీకాంత్, అజరు, ప్రణరులే బరిలోకి దిగే అవకాశముంది' అని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఫిలిఫ్పిన్స్, దక్షిణ కొరియా మ్యాచ్తో ఆసియా పోరు ఆరంభం కానుంది.