Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనికి మాజీ క్రికెటర్ల మద్దతు
- ప్రస్థుత పరిస్థితుల్లో సరికాదు
- 2016 టి20 వరల్డ్ కప్ వరకు కొనసాగాలి
'నేెను నా ఆటపట్ల సంతోషంగానే ఉన్నాను. ఒకవేళ జట్టు ఓటమికి నేనే కారణమని భావించి, నన్ను తొలగించడం సబబు అని అందరూ అనుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కెప్టెన్గా తప్పుకుని ఓ ఆటగాడిగా జట్టులో కొనసాగడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.భారత క్రికెట్ ఎదుర్కొంటున్న ప్రతి అపజయానికి కారణం నేనే. నాదే బాధ్యత' అని ధోని వెల్లడించారు.
''బంగ్లాదేశ్తో వరుసగా రెండు వన్డేల్లో ఓటమిపాలై సిరీస్ కోల్పోయినందుకు తనదే బాధ్యత అంటూ కెప్టెన్ ధోని వన్డేల్లో కెప్టెన్సీ రాజీనామకు సిద్ధం అన్నాడు. అయితే ఒక్క సిరీస్ పోయినంత మాత్రాన కెప్టెన్సీ వదులుకోవలసిన అవసరం లేదని, పైగా ఇప్పుడే జట్టుకు ధోని అవసరం ఉందంటూ మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు''
మిర్పూర్ న్యూఢిల్లీ : భారత్పై వరుసగా రెండు వన్డే మ్యాచుల్లో సంచలన విజయం సాధించి బంగ్లాదేశ్ సిరీస్ ఎగరేసుకుపోయింది. పరువు ఎలా గూ పోయింది ఇప్పుడిక ఏమిటి కర్తవ్యం అని సగటు అభిమాని అనుకుంటున్న తరుణంలో వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పెదవి విప్పాడు. 'ఇదంతా నా వల్లే జరిగింది. దీనికి ఎవరినీ నిందించాల్సిన అవ సరం లేదు. రెండు మ్యాచుల్లో ఓట మికి నాదే బాధ్యత. ఒక వేళ నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే జట్టుకు మే లు జరుగుతుందనుకుంటే దానికి నేను సిద్ధం' అని మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మనసులోని భావాలను వెల్లడించారు. అయితే ధోని వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయడానికి సిధ్దంగా ఉన్నా పలువురు మాజీ క్రికెటర్లు దీనిని ఓప్పు కోవడం లేదు. ధోని వన్డే కెప్టెన్గా కొనసాగాలని కోరుకున్నారు. బిషన్సింగ్ బేడి, దిలీప్ వెంగ్సర్కార్, అజిత్ వాడేకర్, చేతన్ చౌహాన్, చందుబోర్డే, సయ్యద్ కిర్మాణి, కిరణ్ మోరె తదితర మాజీ క్రికెటర్లు ధోనికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ధో కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. 2016లో జరిగే టి20 వరల్డ్ కప్ వరకు కెప్టెన్గా సాగాలని సూచించారు.
'ధోనిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ముగిసిన వరల్డ్కప్లో భారత్ను సెమీఫైనల్ వరకు తీసుకెళ్లాడు. దాని తర్వాత జరుగుతున్న మొదటి టోర్నమెంట్ ఇది. అతడు కెప్టెన్గా కొనసాగాలి'
- దిలీప్ వెంగ్సర్కార్
'వన్డే సిరీస్లో ఓటమికి ఏ ఒక్కరినో నిందించాల్సిన అవసరం లేదు. జట్టు సమష్టిగా ఓడింది. దీనికి ధోనిని బాధ్యున్ని చేయాల్సిన పనిలేదు. నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. కానీ మ్యాచ్ అనంతరం ధోని మీడియాతో ఏం మాట్లాడాడో అది కేవలం ఓటమిని తట్టుకోలేక ఉద్వేగంతో మాట్లాడిందే. గెలుపోటములు ఆటలో సహజం. అలాగే గెలిచినపుడు ప్రశంసలు, ఓడినపుడు విమర్శలు లాంటివి ధోని ఎన్నో చూశాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ ధోని ఇలా మాట్లాడినపుడు చూడడం మొదటిసారి'
- బిషన్ సింగ్ బేడి
'వన్డేలు, టి20 మ్యాచ్లకు నాయకత్వం వహించడంలో ధోని గొప్ప నాయకుడు. అతడు ఇప్పుడే వన్డేల నుంచి రిటైర్ కానవసరం లేదు. బహుశా మనవాళ్లు వన్డే సిరీస్లో బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేసి ఉంటారు. దీంతోపాటు సరైన సన్నాహకాలు చేయలేదు'
- అజిత్ వాడేకర్
'ధోని గొప్ప ఆట గాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఓడినంత మాత్రాన అతడిని నిందించాల్సిన అవసరం లేదు. ఓడిపో వడం అనేది ఆటలో సహ జం.. జట్టు ఓడిన ప్పుడు సహ జంగానే కెప్టెన్ను తప్పిం చాలి లాంటివి వినిపిస్తుంటాయి. కెపెట్టన్ ఫామ్లో లేనప్పుడు లేదా సిరీస్ కోల్పోయినపుడు మాత్రమే ఇలాంటి విమర్శలు వస్తాయి. వీటిని పట్టించుకుని ధోని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ కూడా చాలా మందిని కెప్టెన్ల ను చేసింది. కానీ ప్రస్తుతం ఆ జట్టు విజ యానికి కారణం సమిష్టి కృషి కానీ కెప్టెన్లు ఏ రకంగానూ కాదు. ధోని ఎన్నో విజయాల్ని అందిం చాడు. వాటితో పాటు కొన్ని ఓటములు కూడా ఉన్నాయి అనుకోవాలి.'
-సయ్యద్ కీర్మాణి
'ధోని బంగ్లాదేశ్ సిరీస్ ఒక పీడకల అనుకోవాలి. కానీ ఈ ఓటమి జీర్ణించుకో వడానికి కొంచెం సమయం పడుతుంది. బంగ్లాదేశ్ ఇలా ఆడి ఆశ్చర్యపరుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మైదానంలో వాళ్ల కదలికలు కూడా అద్భుతంగా ఉన్నాయి. భారత ఆటగాళ్లు మాత్రం ఎటువంటి ఏకాగ్రత చూపలేకపోయారు'
- చందుబోర్డే
'ధోని ఇప్పటికీ పోరాట పటిమ ఉన్న గొప్ప నాయకుడు, మంచి ఆటగాడు. ఒక్క సిరీస్లో ఓడినంత మాత్రాన ఇంత త్వరగా కెప్టెన్ను మార్చాల్సిన అవసరం లేదు.
వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్కప్ వరకు ధోని వన్డేలు, టి20 లకు కెప్టెన్గా కొనసాగాలి. ఆ సిరీస్ తర్వాతే కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి టెస్టులకు కెప్టెన్సీ వరకు సరిపోతాడు. అయితే రెండో వన్డేలో రహానేను తప్పించడం అనేది సరికాదనిపిస్తోంది.
- చేతన్ చౌహాన్
'ప్రస్తుత పరిస్థుతుల్లో కెప్టెన్సీ మార్పు అనవసరం. ధోని కెప్టెన్గా కొనసాగడమే ఉత్తమం. అతను భారత్కు ఇంకా ఎన్నో విజయాల్సి అందించగలడు. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. భారత ఆటగాళ్లు ఎక్కువగా క్రికెట్ ఆటడం వల్ల ఉత్సాహం లోపించి ఆలసిపోయారని పిస్తోంది. దీనిపై బిసిసిఐ ఆలోచించాలి. కెప్టెన్సీ మార్పు అనవసరం. ఇవన్నీ ఉద్వేగంతో కూడిన అనవసరపు ఆలోచనలు. జట్టుకు కొత్త వారిని ఎంపికచేసి భిన్న కాంబినేషన్లతో ఆడించాలి. బౌలింగ్లో కూడా సమస్యలున్నాయి. ఐపీఎల్లో పెద్దగా రాణించకున్నా జడేజాను ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. భువనేశ్వర్ కుమార్ది కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం జట్టుకు ఒక లెగ్ స్పిన్నర్ను ఎంపికచేయాల్సిన అవసరం ఉంది'
-కిరణ్మోరె
'వన్డే కెప్టెన్సీలో ఎటువంటి మార్పు అనవసరం. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో ధోనికి తెలుసు. అతడు వన్డేల్లో కొనసాగాలి. ఆటగాళ్లతో మాట్లాడడానికి అతనికి కావలసినంత సమయం ఉంది. దాంతోపాటు ధోనికి కొత్త ప్రణాళికలు ఆలోచించడానికి కూడా వీలైనంత టైముంది'
- విజరు దహియా.