Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన లక్ష్య సేన్, రిత్వికా
- వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్్
హో చిమిన్హ్ సిటీ : భారత యువ డబుల్స్ సంచలనాలు.. అర్జున్ ఎమ్ఆర్, రామచంద్రన్ శ్లోక్లు శుక్రవారం జరిగిన వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్్లో సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఐదో సీడ్ భారత జోడీ 21-13, 18-21, 21-13తో తారులాండ్ జంటపై గెలుపొందారు. దూకుడుగా ఆడి..45 నిమిషాల్లోనే మూడు సెట్ల క్వార్టర్స్పోరు ముగించారు. పురుషుల సింగిల్స్లో భారత బ్యాడ్మింటన్ కెరటం లక్ష్య సేన్ 17-21, 23 21, 10-21తో కొడై నరఓక (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. గంటకు పైగా సాగిన పోరులో చివరి సెట్లో తడబడ్డాడు. మహిళల సింగిల్స్లో రిత్వికా శివాని గద్దె 21-18, 15-21, 8-21తో మూడో సీడ్ ఇండోనేషియా క్రీడాకారిణి దినర్ ద్యాV్ా ఆయుస్టైన్ చేతిలో పరాజయం చవి చూసింది.