Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్జెడ్ ఫోర్జా ఖార్కివ్ ఇంటర్నేషల్ టోర్నమెంట్
హైదరాబాద్ : గోపీచంద్ అకాడెమీ నుండి మరో క్రీడాకారిణి రాణిస్తోంది. 19 ఏండ్ల శ్రీ కృష్ణ ప్రియ బ్యాడ్మింటన్లో సత్తా చాటుతున్నది. తాజాగా ఉక్రెయిన్లో జరుగుతున్న ఎఫ్జెడ్ ఫోర్జా ఖార్కివ్ ఇంటర్నేషల్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకున్నది. ఈ టోర్నీలో శ్రీ కృష్ణ ప్రియ మూడో సీడ్గా బరిలోకి దిగింది. ఫైనల్ దారిలో 21-10, 21-7 తో జుజానా పవెల్కోవాను సెమీస్లో చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఐదో సీడ్ క్రీడాకారిణి మరియా మిత్సవాను సైతం 6-21, 21-12, 21-14తో వెనక్కునెట్టింది. జాతీయ కోచ్ గోపీచంద్ శిక్షణలో శ్రీ కృష్ణ ప్రియ అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచ 68వ ర్యాంకులో కొనసాగుతున్నది. ఉక్రెయిన్ టోర్నీలో ఫైనల్ చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ' తాజాగా భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. నన్ను ప్రోత్సహించిన అందరికి కృతజ్ఞతలు' అని పేర్కొన్నది.