Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి చేతిలో పట్నా ఓటమి ొ ప్రొ కబడ్డీ
సోనీపట్ : పాయింట్ల వరదపారిన పోరులో పట్నా పరాజయం పాలైంది. శనివారం జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్లో యు ముంబ 51-41తో పట్నా పైరేట్స్ను ఓడించింది. పర్దీప్ నర్వాల్ 21 రైడ్ పాయింట్ల అద్భుత ప్రదర్శన పట్నా ఓటమిని ఆపలేకపోయింది. తొలి రెండు పాయింట్ల వరకే పట్నాది పైచేయి. ఆపై ఆట ముగిసివరకూ ముంబయిదే ఆధిక్యం. విరామ సమయానికి ముంబయి 24 పాయింట్లతో ఉన్నది. ఇక 14 పాయింట్లతో విరామానంతరం ఆట ప్రారంభించిన పట్నా భీకరంగా పోరాడింది. ఓ దశలో 30-32తో ముంబయికి అతి చేరువలో నిలిచింది. ముంబయి రైడర్లు సైతం చెలరేగడంతో పది పాయింట్ల తేడాతో ముంబయి గెలుపొందింది. పట్నా డిఫెన్స్ ఘోరంగా విఫలమైంది. కాశీలింగ్ 15 రైడ్ పాయింట్లు సాధించి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీకాంత్ జాదవ్ 13 పాయింట్లు, దర్శన్ ఎనిమిది పాయింట్లు రాణించారు. జోన్ ఎ పట్టికలో 39 పాయింట్లతో యు ముంబ రెండో స్థానానికి ఎగబాకింది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 38-31తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. 14-14 విరామ సమయానకి స్కోరు.
రెండు సార్లు బెంగళూరు ఆలౌట్ అయింది. దీంతో ద్వితీయార్థంలో హర్యానాపాయింట్లు పెంచుకున్నది. ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా చివరి దాకా ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇరు జట్ల రైడింగ్లో సమంగా రాణించినా.. పేలవడిఫెన్స్ కారణంగా బెంగళూరు ఓటమి పాలైంది. హర్యానా ఆటగాడు 17 రైడ్లు చేసిన ప్రశాంత్ కుమార్ రారు 16 పాయింట్లు సాధించాడు. అజరు కుమార్ 13 పా యింట్లతో రాణించాడు.