Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్జెడ్ ఫోర్జా ఖార్కివ్ ఇంటర్నేషల్ టోర్నమెంట్
ఖార్కివ్ (ఉక్రెయిన్) : ఆదివారం జరిగిన ఫోర్జా ఖార్కివ్ ఇంటర్నేషల్ టోర్నీ ఫైనల్స్లో మిక్స్డ్ సహా పురుషుల డబుల్స్లో భారత యువ షట్లర్లు విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో నందగోపాల్, రోహన్ కపూర్లు 18-21, 24-22, 21-18తో ఫ్రాన్సిస్, కోన తరుణ్లపై గెలుపొందారు. మిక్స్డ్లో మూడో సీడ్ నందగోపాల్, మహిమా అగర్వాల్ జోడీ 21-14, 21-15తో టాప్ సీడ్ సౌరభ్, అనౌష్కలను ఓడించారు. ఫైనల్ పోరులో మూడో సీడ్ శ్రీ కృష్ణ ప్రియ 21-18, 16-21, 21-23తో ఉక్రెయిన్ ప్లేయర్ నటాల్యా చేతిలో పోరాడి ఓడింది.