Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా క్రికెట్ బోర్డును కోరిన షకీబ్
ఢాకా : బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్ నుంచి ఆర్నెల్ల విరామం కోరినట్టు బంగ్లా క్రికెట్ బోర్డు తెలిపింది. దక్షిణాఫ్రికా టూర్లో పాల్గొనే జట్టు వివరాలు ప్రకటించనున్న నేపథ్యంలో షకీబ్ ఈ మేరకు బోర్డుకు లేఖ రాశాడు. తనకు విశ్రాంతి కావాలని..టెస్టు క్రికెట్ నుంచి ఆరు నెలల విరామం ఇవ్వాలని కోరాడు. అయితే వన్డే, టి20 మ్యాచులు ఆడతానని పేర్కొన్నాడు. బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ షకీబ్ వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. బోర్డు అనుమతిస్తే దక్షణాఫ్రికాతో రెండు టెస్టులు సహా, ఏడాది చివర్లో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు షకీబ్ దూరం కానున్నాడు.