Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తొలి టి20 పోరు
కరాచి : ఎనిమిదేండ్ల తర్వాత పాక్ గడ్డపై ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనున్నది. పాకిస్థాన్ జట్టుతో వరల్డ్ జట్టు నేడు తొలి టి20 ఆడనున్నది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి అనంతరం ఒక అధికారిక జట్టు పాక్లో పర్యటించడం ఇదే తొలిసారి. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఈ నెల 15 న ముగియనున్నది. వరల్డ్ ఎలెవన్ రాకతో పాక్ క్రికెట్ పూర్వవైభవం సంతరించుకోవాలని పీసీబీ ఆశిస్తున్నది. ఈ విషయంలో ఐసీసీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. వరల్డ్ జట్టు ఆటగాళ్లంతా పాక్ క్రికెట్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపడానికి సిద్దమైన తరుణంలో.. టూర్ సజావుగా జరగడానికి, ఆటగాళ్ల భద్రతకోసం ఐసీసీ సైతం నిధులు ఖర్చు చేస్తున్నది. నిరుడు జింబాంబ్వే పాకిస్థాన్లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడగా.. అంపైర్లను పంపడానికి సైతం అంగీకరించని ఐసీసీ వరల్డ్ ఎలెవన్ పాక్ టూర్పై ప్రత్యేక శ్రద్ధపెట్టడం విశేషం.
ఐసీసీ భద్రతాధికారులు ఇదివరకే రెండుసార్లు పాక్లో పర్యటించి సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షంచారు. టి20 మ్యాచ్లకు వేదికైన గడాఫీ స్టేడియం బయట పాక్ ఆర్మీ మోహరించింది. పాక్ పేసర్ మహమ్మద్ ఆమిర్ వెన్ను నొప్పితో ఈ సిరీస్లో లేకపోవడం జట్టుకు లోటు. ఈ సందర్భంగా వరల్డ్ ఎలెవన్ సారథిత డుప్లెసిస్ మాట్లాడుతూ 'ఈ టూర్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పాక్ అభిమానులు చాన్నాండ్ల తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ చూడబోతున్నారు. పాకిస్థాన్కు మళ్లీ క్రికెట్ను తీసుకొచ్చి మంచి పని చేశాం అని చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది' అన్నాడు.