Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీఘడ్ : ఈ ఏడాది నవంబర్ 24 నుంచి 26 వరకు జరగనున్న మాస్టర్స్ బాడ్మింటన్ లీగ్కు పంచకుల వేదిక కానున్నది. లీగ్లో ప్రతిభగల మాజీ కోచ్లు, ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ ఆటతో ఆకట్టుకోనున్నారు. 30 ఏండ్ల పైబడిన మహిళలు, 35 ఏండ్ల పైబడిన పురుషులు ఈవెంట్లో తమ ప్రతిభను చాటుకోనుండటం విశేషం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బారు), హర్యానా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (హెచ్బీఏ)లు సంయుక్తంగా లీగ్ నిర్వహించనున్నట్టు నిర్వాహక కార్యదర్శి వినరు భల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆటగాళ్ల వేలం ప్రక్రియ అక్టోబర్ 2 న జరగనున్నట్టు ఆయన తెలిపారు.