Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : టీమిండియా ఆటగాడు సురేష్ రైనాకు తృటిలో ప్రమాదం తప్పింది. దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు వెళ్తుండగా ఎస్యువీ వాహనం టైర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రైనా వాహనం పరిమిత వేగంలోనే ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. బ్లూ ఇండియాకు సారథ్యం వహిస్తున్న రైనా.. ఘజియాబాద్ నుంచి కాన్పూర్ వెళ్తుండగా ఎత్వా దగ్గర్లోని ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలోనే కారును వదిలేసిన రైనా పోలీసులు ఏర్పాటు చేసిన మరో వాహనంలో గ్రీన్ పార్క్ స్టేడియం చేరుకున్నాడు.