Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పాయింట్ తేడాతో తలైవాస్ చేతిలో ఓటమి
సోనెపట్ (హర్యానా)
జోరుమీదున్న యూపీ యోధాకు తలైవాస్ షాకిచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్లో నితిన్ తోమర్ జట్టు తొలి నుంచి ఆధిక్యంలోనే కొనసాగినా.. ఆఖర్లో మెరిసిన తలైవాస్ మెరుపు విజయం సాధించింది. సీనియర్ రైడర్ అజరు ఠాకూర్ క్లిష్ట సమయంలో పాయింట్లు సాధించి, తమిళ తలైవాస్ను గట్టెక్కించాడు. 34-33తో యూపీ యోధాపై విజయాన్ని అందించాడు. యూపీ యోధా స్టార్ రైడర్ నితిన్ తోమర్ 14 రైయిడ్ పాయింట్లతో రాణించినా, ఫలితం లేకపోయింది. విరామ సమయానికి 18-12తో మంచి ఆధిక్యంలోని నిలిచిన యోధా ద్వితియార్థంలో పట్టు కోల్పోయింది. 26-21తో ముందంజలో కొనసాగినా.. ఆఖర్లో తలైవాస్ పుంజుకున్నది. యోధాతో సమవుజ్జీగా నిలిచింది. తలైవాస్ 30-31తో ఉన్న తరుణంలో అజరు ఠాకూర్ రెండు పాయింట్లు సాధించగా 33-31తో తలైవాస్ ముందంజ వేసింది. మ్యాచ్ ఆఖరి రెండు రైయిడ్లలో ఆధిక్యం నిలుపుకున్న తలైవాస్ ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది. అజరు ఠాకూర్ సహా ప్రపంజన్లు చెరో ఎనిమిది రైయిడ్ పాయింట్లు సాధించారు. డిఫెన్స్లో అమిత్ హుడా నాల్గు ట్యాకిల్స్తో ఆకట్టుకున్నాడు. యూపీ యోధా తరఫున నితిన్ తోమర్ 14 పాయింట్లు సాధించగా, రిషాంగ్ దేవాడిగ ఎనిమిది పాయింట్లు తీసుకొచ్చాడు. డిఫెన్స్లో నితేశ్ కుమార్ ఐదు ట్యాకిల్స్లో రెచ్చిపోయాడు.
ఆ మ్యాచులు రాంచీ, పుణెల్లో.. : ముంబయిలో భారీ వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచుల షెడ్యూల్ను ప్రొ కబడ్డీ నిర్వాహకులు బుధవారం విడుదల చేశారు. ఇటీవల ముంబయిలో ఎడతెరపి లేని వర్షంతో స్టేడియానికి బయల్దేరిన జట్టు బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు జరగాల్సిన రెండు మ్యాచుల్ని వాయిదా వేశారు. వాటిల్లో బెంగళూర్ బుల్స్, యూపీ యోధా మధ్య మ్యాచ్ను సెప్టెంబర్ 20న రాంచీలో నిర్వహించనున్నారు. యు ముంబా, గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్ మ్యాచ్ను అక్టోబర్ 17న పుణెలో జరుపనున్నారు. ఆ రోజు జరగాల్సిన మ్యాచ్లకు ముందుగా ఈ మ్యాచులు నిర్వహించటం జరుగుతుంది.