Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో సాయిప్రణీత్, కశ్యప్
- కొరియా ఓపెన్ సూపర్ సిరీస్
సియోల్ (దక్షిణ కొరియా): ప్రపంచ చాంపియన్షిప్స్లో సిల్వర్ సాధించిన ఊపుమీదున్న తెలుగు తేజం, ఐదో సీడ్ పి.వి సింధు సియోల్లో శుభారంభం చేసింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో అలవోక విజయం సాధించిన సింధు.. 21-13, 21-8తో హాంగ్కాంగ్ అమ్మాయిని చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ సహా బి. సాయిప్రణీత్, సమీర్ వర్మలు ప్రీ క్వార్టర్స్లోకి చేరుకున్నారు. కానీ హెచ్.ఎస్ ప్రణరు తొలి రౌండ్ నుంచే ఇంటి బాట పట్టాడు. అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు విశ్రాంతి నిమిత్తం కొరియా ఓపెన్లో పాల్గొనటం లేదనే సంగతి తెల్సిందే.
హాంగ్కాంగ్ అమ్మాయి చెయింగ్ నగన్ యిపై సింధు వరుస గేముల్లో గెలుపొందింది. 21-13, 21-8తో కేవలం 34 నిమిషాల్లోనే తొలి రౌండ్లో విజయం సాధించింది. తొలి గేమ్లో సింధు 3-0, 6-3తో ముందంజలో నిలిచినా విరామ సమయానికి 11-10తో చెయింగ్ పోటీలోనే నిలిచింది. ద్వితీయార్థంలో వరుసగా నాల్గు పాయింట్లతో 14-10తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు 19-13తో తొలి గేమ్ను లాంఛనం చేసుకున్నది. ఇక రెండో గేమ్లోనూ సింధు దూకుడు కొనసాగింది. 11-6తో దూసుకెళ్లిన సింధు 17-6తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే ప్రీ క్వార్టర్స్ పోరులో థారులాండ్ షట్లర్ నిచనాన్ జిందాపాల్తో సింధు తలపడనున్నది. జిందాపాల్తో ముఖాముఖి రికార్డులో 1-1తో సమవుజ్జీగా ఉన్న సింధు నేటి పోరులో పైచేయి సాధించాలని చూస్తోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ 21-13, 21-16తో శుభారంభం చేశాడు. చైనీస్ తైపీ షట్లర్ను 35 నిమిషాల్లోనే ఓడించిన కశ్యప్ ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. సమీర్ వర్మ సైతం తొలి రౌండ్లో గెలుపొందాడు. మూడు గేముల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 21-13, 21-23, 21-9తో తనోన్సక్ (థారులాండ్)పై పైచేయి సాధించాడు. తొలి గేమ్ను సునాయాసంగా నెగ్గినా.. రెండో గేమ్ను ట్రైబ్రేకర్లో కోల్పోయాడు సమీర్. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 21-9తో మూడో గేమ్ను, ప్రీ క్వార్టర్స్ బెర్త్ను ఖాయం చేసుకున్నాడు. సింగపూర్ సూపర్ సిరీస్ హీరో బి. సాయిప్రణీత్ 21-15, 21-10తో అలవోక విజయం సాధించాడు. హాంగ్కాంగ్ ఆటగాడు హు యున్పై 28 నిమిషాల్లోపేత విజయాన్ని అందుకున్నాడు. మరో స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుకి మాత్రం తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్ హాంగ్కాంగ్ షట్లర్ అంగుస్ చేతిలో 17-21, 23-21, 14-21తో ప్రణరు పోరాడి ఓడాడు. మరో మ్యాచ్లో సౌరవ్ వర్మ 21-18, 13-21, 19-21తో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటో చేతిలో మూడు గేముల మ్యాచ్లో ఓటమిపాలయ్యాడు. పురుషుల డబుల్స్ విభాగంలో మను అట్రి, సుమీత్ రెడ్డిలు 11-21, 10-21తో కొరియా జోడీ చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 21-19, 13-21, 17-21తో మలేషియా జోడీ చేతిలో పోరాడి ఓడారు.