Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనీపట్ : గురువారం జరిగిన హర్యానా, జైపూర్ల కబడ్డీ మ్యాచ్ 27-27తో టై గా ముగి సింది. నితిన్ రావల్ 11 రైడ్ల అద్భుత ప్రదర్శన జైపూర్ను ఓటమి కోరలనుంచి తప్పించింది. తొలి అర్ధభాగంలో జైపూర్ ఒక్క టాకిల్ సాధించలేదు. డిఫెన్స్ వైఫల్యంతో రెండంకెల స్కోరు సైతం అందుకోలేకపోయింది. విరామానంతరం ఎనిమిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న హర్యానా దూకుడు కొనసాగించింది. ఆట మరో నాల్గు నిమిషాలు ఉందనగా జైపూర్ ఆటగాడు నితిన్ రావల్ చేసిన రైడ్.. రివ్యూ సక్సెస్ కావడంతో సూపర్ రైడ్ అయింది. దీంతో పాయింట్ల అంతరాన్ని రెండుకు తగ్గింది. సుర్జీత్ అవుట్తో హర్యానా ఆలౌట్ కాగా స్కోరు సమం అయింది. హోరాహోరీగా సాగిన చివరి మూడు నిమిషాల్లో ఇరు జట్లు సమంగా పాయింట్లు గెల్చి మ్యాచ్ టై చేసుకున్నాయి. డూ ఆర్ డై రైడ్లతో మయూర్ ఆకట్టుకున్నాడు. దీపక్ కుమార్ దహియా ఏడు, సుర్జీత్ సింగ్ ఆరు పాయింట్లు రాణించారు.