Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46-30తో తెలుగు టైటాన్స్పై గెలుపొం దింది. పర్దీప్ నర్వాల్ దూకుడుకు మోను గోయత్ తోడయ్యాడు. రాహుల్ చౌదరి మెరిసినా ప్రయోజనం లేకపో యింది. పదో నిమిషానికే టైటాన్స్ ఆలౌట్ కాగా 10-2తో పట్నా ఆధిక్యం లో ఉన్నది. ఎనిమిది పాయింట్ల అంత రాన్ని తగ్గించిన టైటాన్స్ ఓ దశలో సమంగా నిలిచినా, విరామ సమయా నికి పట్నా ఏడు పాయింట్ల ఆధిక్యం చేజిక్కించుకున్నది. ద్వితీయార్ధంలో రెండు సార్లు ఆలౌట్ అయిన టైటాన్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా పట్నా పటిష్ఠ డిఫెన్స్ అడ్డుకున్నది. రైడర్లు డిఫెండర్లు సమంగా రాణించటంతో పైరేట్స్ సీజన్లో ఆరో విజయం అందు కున్నది. పట్నా 24 రైడ్ పాయింట్లు సాధించగా.. పర్దీప్ నర్వాల్ ఒక్కడే 14 పాయింట్లు తెచ్చాడు. జయదీప్ నాలుగు టాకిల్స్ రాణించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ 39-28తో ముంబయిపై విజయం సాధించింది.