Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లోనూ తిరుగులేని పి.వి సింధు
- ముగిసిన సమీర్ వర్మ పోరాటం
- సాత్విక్, చిరాగ్లకు ఓటమి
- కొరియా ఓపెన్ సూపర్ సిరీస్
సియోల్ (దక్షిణ కొరియా)
భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పి.వి సింధు మరో సూపర్ సిరీస్ టైటిల్కు చేరువైంది. సియోల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న తెలుగు
తేజం కొరియా ఓపెన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ నెం.19 మినట్సు మిటాని (జపాన్)తో జరిగిన క్వార్టర్ఫైనల్స్ పోరులో మూడు గేముల పాటు పోరాడిన సింధు 2-1తో గెలుపొందింది. సియోల్ లో సింధు తొలిసారి మూడు గేముల ఆడాల్సి వచ్చింది. 21-19, 16-21, 21-10తో మిటానిపై సింధు మెరుపు విజయం సొంతం చేసుకున్నది. నేడు జరిగే సెమీఫైనల్స్ సమరంలో చైనా స్టార్ హీ బింగ్జియవ్తో సింధు తలపడాల్సి ఉన్నది. చైనా షట్లర్తో ముఖాముఖి పోరులో 3-5తో వెనుకంజలో కొనసాగుతున్న సింధు.. నేటి సెమీస్ మ్యాచ్లో మెరుపడా లని చూస్తుంది. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న సింధును ఢకొీట్టడం చైనా అమ్మాయికి సైతం కఠిన పరీక్షే!. మహిళల సింగిల్స్ మినహా అన్ని విభాగాల్లోనూ భారత పతక ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ క్వార్టర్ఫైనల్స్ నుంచే నిష్క్రమిం చాడు. మెన్స్ డబుల్స్ విభాగం లో సాత్విక్ సాయిరెడ్డి, చిరాగ్ శెట్టిలు సైతం క్వార్టర్స్ నుంచే వెనక్కి వచ్చేశారు.
తొలిసారి తడబడినా.. : జపాన్ క్రీడాకారిణి మిన ట్సు మిటానితో క్వార్టర్స్ పోరులో పి.వి సింధు తడబాటుకు లోనైంది.టోర్నీలో తొలిసారి ప్రత్యర్థి కి ఓ గేమ్ను కోల్పోయింది. గంటకు పైగా సాగిన ఈ మ్యాచ్లో జపాన్ చిన్నది సింధుకు గట్టి పోటీనే ఇచ్చింది. కానీ ఆఖరి పంచ్ అదిరేలా ఇచ్చిన సింధు ఆధిపత్యం చాటుకున్నది. 21-19, 16-21, 21-10తో మిటానికి మట్టికరిపించింది. తొలి గేమ్లో 3-1, 7-3తో సింధు శుభారంభం చేసింది. కానీ 11-9తో విరామ సమయానికి ఆధిక్యం సాధించిన మిటాని దూకుడు ప్రదర్శించింది. ద్వితియార్థంలో వరుస పాయింట్లు సాధించిన సింధు 11-11తో స్కోరు సమం చేసింది. ఇక్కడ్నుంచి చెరో పాయింట్ పంచుకోవటంతో 11-11 నుంచి 16-16 వరకూ సమవుజ్జీలుగా సాగారు. 19-16తో సింధు ఆఖర్లో కీలక పాయింట్లు సాధించినా, మినట్సు వదల్లేదు. 19-19తో స్కోరు సమం చేసింది. గేమ్ పాయింట్ వద్ద నేర్పుగా ఆడిన సింధు 21-19తో తొలి గేమ్ను దక్కించుకున్నది.
తొలి గేమ్లో భంగపడిన మిటాని.. తర్వాతి గేమ్లో పుంజుకున్నది. 4-8, 9-12తో వెనుకంజ వేసిన సింధు.. 13-13తో స్కోరు సమం చేసింది. కానీ మిటాని వరుస పాయింట్లతో సింధును కోలుకోనీయలేదు. దీంతో 16-21తో సింధు రెండో గేమ్ను కోల్పోవాల్సి వచ్చింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు జూలు విదిల్చింది. మినట్సును చిత్తు చేసింది. వరుస పాయింట్లు సాధించి 11-3తో విరామ సమయానికి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. సింధు దూకుడుకు మినట్సు మూడో గేమ్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 19-9తో సెమీస్ బెర్త్ లాంఛనం చేసుకున్న సింధు 21-10తో మ్యాచ్ను ముగించింది. మహిళల సింగిల్స్ మరో క్వార్టర్స్ మ్యాచుల్లో నొజొమి ఒకుహర (జపాన్), అకానె యమగూచి (జపాన్)లు గెలుపొందారు. నేడు జరిగే సెమీస్లో వరల్డ్ చాంపియన్ ఒకుహరతో యమగూచి అమీతుమీ తేల్చుకోనున్నది.
ఇక పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ పోరాడి ఓడాడు. ఏడాది ఆరంభంలో ఇండియన్ ఓపెన్లో సన్ వాన్ హోను ఓడించిన సమీర్ వర్మ సియోల్లో ఆ ప్రదర్శన పునారవృతం చేయలేదు. వరల్డ్ నెం.1 సన్ వాన్ హో (కొరియా) సెమీస్ చేరేందుకు గంటకుపైగా చెమటోడ్చాడు. 22-20, 10-21, 13-21తో సమీర్ వర్మ పోరాడి ఓడాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయి రెడ్డి, చిరాగ్ శెట్టిలు 14-21, 21-17, 15-21తో మూడో సీడ్ జపాన్ జంట చేతిలో ఓటమిపాలయ్యారు.
టాప్ అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
ఒలింపిక్ టాస్క్ఫోర్స్ సిఫారసు మేరకు టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద ఎంపిక చేసిన క్రీడాకారులకు కేంద్రం ఉపకార వేతనం అందజేయననున్నది. ప్రస్తుతం టాప్ కింద 125 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరికి నెలకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు క్రీడాశాఖ మంత్రి రాథోర్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి అథ్లెట్లు ఈ ఆర్థిక ప్రోత్సాహకం అందుకోనున్నారని ట్వీట్టర్లో వెల్లడించారు.