Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుపీపై పట్నా గెలుపు
రాంచీ : ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ను టైటాన్స్ అనూహ్యంగా టై చేసుకున్నది. 26-21తో బుల్స్ ఆధిక్యంలో ఉండగా.. చివరి నిమిషాల్లో ఏకంగా ఐదు పాయింట్లు సాధించిన టైటాన్స్ 26-26తో స్కోరు సమం చేసింది. ఆఖర్లో మూడు సూపర్ టాకిల్స్ చేసిన విశాల్ భరద్వాజ్ టైటాన్స్ ఆలౌట్ను అడ్డుకున్నాడు. బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ ఎనిమిది పాయింట్లతో రాణించినా, డిఫెండర్ల నుంచి సహకారం కొరవడింది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్లో పట్నా 45-42తో యుపీపై గెలుపొందింది.