Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కివీస్ స్పీడ్ బాండ్, న్యూజిలాండ్-ఎ జట్టు కోచ్ షేన్ బాండ్ చీఫ్ కోచ్ పదవిపై మనసు పారేసుకున్నాడు. ఎ జట్టు భారత పర్యటన సందర్భంగా ఇక్కడికొచ్చిన బాండ్.. మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే బ్రిస్బేన్ హీట్స్ సహా ముంబయి ఇండియన్స్లకు బౌలింగ్ కోచ్గా పనిచేస్తున్న బాండ్.. అవకాశం చిక్కితే చీఫ్ కోచ్ చేయాలనుకుంటున్నాడు. ఐపీఎల్ ప్రాంఛైజీతో చీఫ్ కోచ్గా చేయాలని కోరుకుంటున్నాను. బౌలింగ్ కోచ్గా వచ్చిన అవకాశాలను ఆస్వాదించాను. ఇక చీఫ్ కోచ్గా చేయాలని అనుకుంటున్నానని షేన్ బాండ్ అన్నాడు.