Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సైనా, శ్రీకాంత్ సైతం
నవతెలంగాణ-టోక్యో
కొరియా ఓపెన్ నెగ్గిన తొలి భారతీయ షట్లర్గా సియోల్లో కొత్త చరిత్ర సృష్టించింది తెలుగు తేజం పి.వి సింధు. సియోల్ నుంచి నేరుగా టోక్యో చేరుకున్న సింధు సూపర్ ఫామ్ జోరులో జపాన్ ఓపెన్పై కన్నేసింది. ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహరపై ప్రతీకారం విజయంతో దుమ్మురేపిన సింధు.. అదే జోరును టోక్యోలోనూ పునరావృతం చేసేందుకు అడుగులు వేస్తోంది. మహిళల సింగిల్స్లో టైటిల్ ఫేవరేట్గా సింధు బరిలోకి దిగుతోంది. వరల్డ్ నెం.1 థారు జు యింగ్ (చైనీస్ తైపీ), అకానె యమగూచి (జపాన్), సంగ్ జీ హ్యూన్ (కొరియా) సహా కరొలినా మారిన్ (స్పెయిన్)లు సైతం సింధుతో పాటు టైటిల్ వేటలో ఫేవరేట్లుగా నిలిచారు. వరల్డ్ చాంపియన్షిప్స్ కాంస్యంతో ఫామ్లోకి వచ్చిన అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ కొంత విరామం తీసుకుని టోక్యోలో ఆడనున్నది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ భారత ఆశల భారం మోయనున్నాడు. నేడు క్వాలిఫయింగ్ మ్యాచులతో జపాన్ ఓపెన్ ఆరంభం కానున్నది. సింధు, సైనాలు క్వార్టర్స్ దాటితే ఫైనల్స్ బెర్త్ కోసం ముఖాముఖి పోరులో ఢకొీట్టను న్నారు. మహిళల సింగిల్స్లో అన్సీడెడ్గా ఆడనున్న సైనా నెహ్వాల్కు కఠినమైన డ్రా ఎదురైంది. రెండో రౌండ్లోనే ఒలింపిక్ చాంపియన్ కరొలినా మారిన్తో సైనా ఆడాల్సి ఉంటుంది. నాల్గో సీడ్ సింధు తొలి రౌండ్లో జపాన్ అమ్మాయి మినత్సు మితానితో ఆడనున్నది. సియోల్లో మూడు గేముల పోరులో మితానిని ఓడించిన సింధు, టోక్యోలో ఆత్మవిశ్వా సంతో కనిపించనున్నది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ ఎనిమిదో సీడ్గా ఆడనున్నాడు.
సౌరభ్ వర్మ, బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరు, సమీర్ వర్మలు పోటీలో ఉన్నారు. సాయి ప్రణీత్ తొలి రౌండ్లోనే విక్టర్ అలెక్సన్తో తలపడను న్నాడు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ, మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి జంటలు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిక్స్డ్ విభాగంలో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డీలు జోడీగా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నేడు జరుగనున్న అర్హత మ్యాచ్లో సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ పోటీలో నిలిచాడు. డెన్మార్క్ ఆటగాడు ఎమిల్ హోల్స్ట్ను ఢకొీట్టనున్నాడు.