Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ చేతిలో బంగ్లా చిత్తు
- ఆసియా హాకీ కప్
ఢాకా : ఆతిథ్య జట్టును మనోళ్లు ఉతికారేశారు. ఒక్క గోల్ ఇవ్వకుండా ఏడు గోల్స్ పిండుకున్నారు. ఆసియా కప్లో హాట్ ఫేవరెట్ భారత్ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై 7-0తో ఏకపక్ష విజయం సాధించింది. పటిష్ట డిఫెన్స్తో దుమ్మురేపిన ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్పైనా చురుకైన దాడులు చేసి అబ్బురపరిచారు పలుసార్లు పెనాల్టీ కార్నర్లను వృథా చేసినా ధాటిగా ఆడి గోల్స్ వర్షం కురిపించారు.. తొలి పోరులో జపాన్పై రెండు గోల్స్ చేసిన హర్మన్ప్రీత్ సింగ్ శుక్రవారం బంగ్లాపై సైతం రెండు గోల్స్ సాధించాడు. అసలు మూడో నిమిషంలోనే భారత్ గోల్ ఖాతా తెరిచేదే. అయితే, ఎస్.వి సునీల్ గోల్ ప్రయత్నాన్ని బంగ్లా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే, ఏడో నిమిషంలో అమిత్ రోహిదాస్ అందించిన పాస్ను వినియోగించటంలో సఫలమైన ఫార్వర్డు ఆటగాడు గుర్జంత్ సింగ్ భారత్ ఖాతాలో తొలి గేమ్ జమ చేశాడు. మూడు నిమిషాల తర్వాత ఆకాశ్ దీప్ సింగ్ మరో చక్కటి గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలో లలిత్ ఉపాధ్యారు అందించిన గోల్తో భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. 14వ నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించినా, హర్మన్ ప్రీత్ సింగ్ మిస్ చేశాడు.
అమిత్ రోహిదాస్ (20వ నిమిషంలో) చేసిన గోల్ అనంతరం భారత్కు వరుసగా దొరికిన ఏ ఒక్క పెనాల్టీ కార్నర్నూ గోల్గా మార్చటంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. తొలి భాగం రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ కొట్టిన హర్మన్ ప్రీత్ బంగ్లాపై తన తొలి గోల్ నమోదు చేశాడు. విరామానంతరం లభించిన మరో మూడు పెనాల్టీ కార్నర్లను సైతం భారత్ వినియోగించుకోలేకపోయింది. మూడో క్వార్టర్ (46వ నిమిషం)లో రమణ్ దీప్ సింగ్ 6-0తో భారత్ విజయాన్ని మరో మెట్టు పైకి చేర్చాడు. తదుపరి నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచిన హర్మన్ ప్రీత్ మ్యాచ్లో ఆఖరు గోల్ కొట్టాడు. భారత్ ఖాతాలో ఏడో గోల్ జమ చేసిన ఆ బంతి బంగ్లా గోల్ పోస్ట్ కుడి అంచులకు తాకుతూ వెళ్లింది. ఈ విజయంతో ఆరు పాయింట్లు నెగ్గిన భారత్ పూల్ ఎ పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నది. తదుపరి తుది పూల్ పోరులో పాకిస్థాన్తో భారత్ తలపడనున్నది. న