Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40-37తో పట్నాపై గెలుపు
పుణె : ప్రొ కబడ్డీలో తమిళ తలైవాస్ విజయాల బాట వీడటం లేదు!. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న తంబీలు తాజాగా డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్నూ ఓడించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సీనియర్ రైడర్ అజరు ఠాకూర్ 14, ప్రపంజన్ 11 రైడ్ పాయింట్లతో రాణించగా 40-37తో తమిళనాడు గెలుపొందింది. డిఫెన్స్లో అమిత్ హుడా నాల్గు ట్యాకిల్స్తో ఆకట్టుకున్నాడు. పట్నా స్టార్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ కూతకెళ్లి ఏకంగా 20 పాయింట్లు తీసుకొచ్చినా, ప్రయోజనం లేకపోయింది. యు ముంబపై 43-24తో పుణె గెలుపొందింది.