Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడి పిచ్ కారణంగా మొదలవ్వని రంజీ మ్యాచ్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్లో జరగాల్సిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను చేజేతులా రద్దు చేసుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), ఈ విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా తీరు మార్చుకోలేదు. జింఖానాలో ఉత్తరప్రదేశ్తో ఆరంభం కావాల్సిన రంజీ మ్యాచ్ తడి పిచ్ కారణంగా మొదలవ్వలేదు. మహారాష్ట్రతో తొలి రంజీ పోరు సైతం నాల్గు రోజుల్లో ఒక్క బంతి పడకుండానే ముగిసింది. తాజాగా ఆస్ట్రేలియాతో భారత్ టీ20 రద్దు అయిన రెండో రోజే జింఖానాలో రంజీ మ్యాచ్ మొదలుకాకపోవటం గమనార్హం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ రోజు రోజంతా వర్షం కురువలేదు. అయినా, హెచ్సీఏ వైఫల్యంతో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయలేని సంగతి తెలిసిందే.